ధూమ్ సినిమా రేంజ్ లో స్కూల్ లో దొంగతనం.. దమ్ముంటే పట్టుకోవాలని సవాల్!
దొంగలు మరీ తెలివిమీరి పోయారు. సినిమాల్లో దొంగతనాలను రిపీట్ చేస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ సినిమా ‘ధూమ్’ తరహాలో దొంగతనం చేసి ఏకంగా సవాల్ చేశారు. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్ లో ఉంటాయో కొత్తగా చెప్పక్కర్లేదు. దొంగతనం చేసి తప్పించుకునే సన్నివేశాలు ఎన్ని సార్లు చూసినా మంచి కిక్కిస్తాయి.. అయితే ఈ సినిమా చూసి ఇన్ స్పైర్ అయిన కొందరు దొంగలు తాజాగా ఓ షాకిచ్చారు.
ఒడిశాలోని నవరంగ్ పూర్ లో కొంతమంది దొంగలు ఓ స్కూల్ లో చొరబడి కంప్యూటర్లు, ప్రింటర్లు ఎత్తుకుపోయారు. అయితే అంతటితో ఆగని దొంగలు చేతనైతే మమ్మల్ని పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసిరారు. కొన్ని ఫోన్ నంబర్లు కూడా బోర్డుపై రాసివెళ్లారు.
సదురు ప్రధానోపాధ్యాయుడు గదిలో ఉన్న కంప్యూటర్లు, జిరాక్స్ మెషీన్లు, ప్రింటర్లు ఇలా కొన్ని వస్తువులు ఎత్తుకుపోయిన దొంగలు ‘ధూమ్4’ తొందరల్లో వస్తుందని రాసివెళ్లారు. పూరి జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది.
శనివారం ఉదయం స్కూల్ కు వచ్చిన అటెండర్ రూమ్ డోర్ తెరిచి ఉండటాన్ని గమనించాడు. అందులో వస్తువులు మాయమైపోవడాన్ని గుర్తించి యాజమాన్యానికి తెలిపాడు. దీంతో స్కూల్ హెచ్ఎం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఖతీగూడ పోలీసులు సైంటిఫిక్ టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో దర్యాప్తు చేపడుతున్నారు.
గతంలో నందహండి బ్లాక్ లోని దహన స్కూల్ ఆఫీసు రూమ్ లో ఉన్న కంప్యూటర్లను దొంగలు దోచుకెళ్లారు. ఆ తర్వాత బ్లాక్ బోర్డ్ పై కొన్ని మొబైల్ నంబర్లు కూడా రాశారు. వాటిలో ఆ పాఠశాలలోనే విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుడి ఫోన్ నంబర్ కూడా ఉంది.
సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒడిశాలోని నవరంగ్ పూర్ లో కొంతమంది దొంగలు ఓ స్కూల్ లో చొరబడి కంప్యూటర్లు, ప్రింటర్లు ఎత్తుకుపోయారు. అయితే అంతటితో ఆగని దొంగలు చేతనైతే మమ్మల్ని పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసిరారు. కొన్ని ఫోన్ నంబర్లు కూడా బోర్డుపై రాసివెళ్లారు.
సదురు ప్రధానోపాధ్యాయుడు గదిలో ఉన్న కంప్యూటర్లు, జిరాక్స్ మెషీన్లు, ప్రింటర్లు ఇలా కొన్ని వస్తువులు ఎత్తుకుపోయిన దొంగలు ‘ధూమ్4’ తొందరల్లో వస్తుందని రాసివెళ్లారు. పూరి జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది.
శనివారం ఉదయం స్కూల్ కు వచ్చిన అటెండర్ రూమ్ డోర్ తెరిచి ఉండటాన్ని గమనించాడు. అందులో వస్తువులు మాయమైపోవడాన్ని గుర్తించి యాజమాన్యానికి తెలిపాడు. దీంతో స్కూల్ హెచ్ఎం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఖతీగూడ పోలీసులు సైంటిఫిక్ టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో దర్యాప్తు చేపడుతున్నారు.
గతంలో నందహండి బ్లాక్ లోని దహన స్కూల్ ఆఫీసు రూమ్ లో ఉన్న కంప్యూటర్లను దొంగలు దోచుకెళ్లారు. ఆ తర్వాత బ్లాక్ బోర్డ్ పై కొన్ని మొబైల్ నంబర్లు కూడా రాశారు. వాటిలో ఆ పాఠశాలలోనే విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుడి ఫోన్ నంబర్ కూడా ఉంది.
సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.