సెక్రటేరియట్ కూల్చివేతకి హైకోర్టు బ్రేక్ !

Update: 2020-07-11 06:30 GMT
తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులకు రాష్ట్ర హైకోర్టు బ్రేక్ వేసింది. సోమవారం వరకు కూల్చివేత  పనులు నిలిపివేయాలని శుక్రవారం ప్రభుత్వానికి  ఆదేశాలు జారీ చేసింది. దీనితోసచ్చివాలయం  కూల్చివేత పనులకి  తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. హైదరాబాద్ కి చెందిన సామాజికవేత్త పీఎల్ విశ్వేశ్వర రావు వేసిన పిల్ ‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ విధమైన ఆదేశాలు జారీచేసింది.  అలాగే , దీనిపై కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే  వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మా సనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటికే 60శాతం కూల్చివేత పనులు పూర్తి అయినట్టు  సమాచారం.  కూల్చివేత చర్యలు 2016లో కేంద్రం జారీ చేసిన నిర్మాణాలు, కూల్చివేత, వ్యర్థాల నిర్వహణ నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు లేదని , ఆ నిబంధనల్లో 4(3) ప్రకారం అనుమతి తీసుకున్న పత్రాలు సమ ర్పించాలని కోరగా, శనివారానికి విచారణ వాయిదా వేస్తే సమర్పిస్తామని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ చెప్పారు. ఇందుకు నిరాకరించిన ధర్మాసనం విచారణను 13వ తేదీ సోమవారానికి వాయిదా వేస్తున్నామని, అప్పటి వరకూ కూల్చివేత లను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.  

ఇక పిటిషనర్ల తరఫు న న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ తన ‌ వాదనలు వినిపిస్తూ...7 లక్షల చదరపు అడుగుల కొత్త భవనాల నిర్మాణం కోసం  10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న పాత  భవనాల్ని పడగొడుతున్నారని ,  4(3) నిబంధన ప్రకారం కూల్చి వేసేం దుకు కాలుష్య నియంత్రణ మండలి నుంచి ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి అనుమతి తీసుకోలేదని, అలాగే  హుస్సేన్ ‌సాగర్‌ వంటి జలాశయం దగ్గర కూల్చివేత, నిర్మాణాలు చేయకూడదని కోర్టుకి తెలిపారు. ఇప్పటికే కూల్చివేత పనులు స్టార్ట్ అయ్యాయి అని , ఆ పనులని నిలిపివేయాలని  ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే , పూర్తి వివరాల సమర్పణకు విచారణను శనివారానికి వాయిదా వేయాలని ఏజీ కోరగా ..దానికి  నిరాకరించిన ధర్మాసనం, 4(3) నిబంధన ప్రకారం అనుమతి తీసుకోకుండా కూల్చివేతలకు పాల్పడు తున్నట్లుగా అనిపిస్తోందని, ప్రభుత్వ వివరణపై తాము సంతృప్తి చెందట్లేదని, విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
Tags:    

Similar News