డ్రగ్స్‌ కేసులో అరెస్ట్ అయిన క్రికెటర్ !

Update: 2020-05-26 05:10 GMT
డ్రగ్స్‌ కేసులో శ్రీలంక బౌల‌ర్  దొరకడం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఈ డ్రగ్స్ కేసులో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ షెహన్ మధుశంకా అరెస్టయ్యాడు. 2017లో అంతర్జాతీయ క్రికెట్‌ లోకి అరంగ్రేటం చేసిన మధుశంకా తొలి మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ వికెట్లతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. బంగ్లాదేశ్ ‌తో జరిగిన ఆ వన్డే మ్యాచ్‌ లో వరుసగా మొర్తజా, రుబెల్ హుస్సేన్, మహ్మదుల్లా వికెట్లను అతను పడగొట్టాడు. అయితే గాయం కారణంగా 2018 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కి ఈ పేసర్ దూరమయ్యాడు.

ఈ వైరస్ నేప‌థ్యంలో మార్చి నుంచి శ్రీలంకలో లాక్‌ డౌన్ అమల్లో ఉండగా.. ఇటీవల రూల్స్ కొన్ని సడలించారు. కానీ.. ఫ్రెండ్ తో కలిసి కారులో పన్నాల రోడ్డుపై వెళ్తున్న షెహన్ మధుశంకా‌ని ఆపిన పోలీసులు త‌నిఖీలు చేశారు. ఆ సమయంలో షెహన్ మధుశంకా వద్ద 2 గ్రాముల హెరాయిన్ దొర‌క‌డంతో అతనిపై కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ఆయ‌న‌ రెండు వారాల కస్టడీకి ఆదేశించారు.

మార్చి 20 నుంచి ఇప్పటి వరకూ శ్రీలంకలో దాదాపు 65 వేల మంది లాక్‌ డౌన్ నిబంధనల్ని అతిక్రమించి అరెస్టయ్యారు. ఇందులో సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా ఉండగా.. క్రికెటర్‌ కూడా ఆ జాబితాలో చేరడం విశేషం. శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా షెహన్ మధుశంకాపై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది.
Tags:    

Similar News