బాబు అవినీతిని తవ్వి తీసి కేసు పెడతాం..

Update: 2018-06-18 11:31 GMT
ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతికి పాల్పడుతూ.. మరోపక్క ధర్మ పోరాటం చేస్తున్నాడని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. రాష్ట్రం బాబు పాలనలో అవినీతీ రాజ్యమేలుతోందన్నారు. పొద్దుటూరులో విలేకరులతో మాట్లాడిన సోము వీర్రాజు చంద్రబాబు తీరును తప్పుపట్టారు.. నీరు చెట్టు - హౌసింగ్ ఫర్ ఆల్ పథకాల్లో చంద్రబాబు 30 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. చంద్రబాబు అవినీతిపై నిపుణులతో విచారణ చేపట్టి ఆయనపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు - పట్టణాలకు కేంద్రం నిధులు అందజేస్తున్నా చంద్రబాబు కేంద్రం ఇవ్వడం లేదని ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు.

టీడీపీ ఎంపీ సీఎం రమేష్ తీరును సోము వీర్రాజు తప్పుపట్టారు. కడప ఉక్కు పరిశ్రమపై టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఆమరణ దీక్ష చేపట్టడం సిగ్గుచేటని విమర్శించారు. జిల్లాలో చక్కెర ఫ్యాక్టరీ, రమేష్ ఇంటి సమీపంలోని పాలకేంద్రం గురించి ఏ రోజైనా ప్రస్తావించాడా అంటూ విరుచుకుపడ్డారు. రాయలసీమ నికర జాలల గురించి పోరాడితే బాగుంటుందని సూచించారు. రాయలసీమలోని కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు బీజేపీ బాధ్యత అని.. రాయలసీమలో హైకోర్టును కూడా ఏర్పాటు చేస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
Tags:    

Similar News