కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు ఎంతో మంది ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ (రాజ్యసభ) రాజీవ్ సాతవ్ (46) కన్నుమూశారు. ఏప్రిల్ 22న కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన రాజీవ్.. అప్పటి నుంచి పుణెలోని జహంగీర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ప్రాణాలు కోల్పోయారు.
2014లో మహారాష్ట్రలోని హింగోలి లోక్ సభ స్థానం నుంచి గెలుపొందిన రాజీవ్ సాతవ్.. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో.. అతన్ని కాంగ్రెస్ రాజ్యసభకు నామినేట్ చేసింది. ఎంపీగానే కాకుండా.. ఏఐసీసీ కార్యదర్శిగానూ పనిచేసిన రాజీవ్.. ప్రస్తుతం గుజరాత్ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ గా ఉన్నారు.
రాజీవ్ మరణం పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. అతను చాలా సమర్థుడైన నేత అతని, భవిష్యత్ ఆశాకిరణం అని అన్నారు. ఇక, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భావోద్వేగంగా స్పందించారు. ‘‘నా స్నేహితుడు రాజీవ్ సాతవ్ ను కోల్పోయినందుకు బాధగా ఉంది. కాంగ్రెస్ ఆదర్శాలు పుణికిపుచ్చుకున్న సమర్థ నాయకుడు. పార్టీపరంగానే కాకుండా.. వ్యక్తిగతంగానూ నాకు పెద్ద నష్టమే. ఆయన కుటుంబానికి నా సానుభూతి తెలుపుతున్నాను’’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
2014లో మహారాష్ట్రలోని హింగోలి లోక్ సభ స్థానం నుంచి గెలుపొందిన రాజీవ్ సాతవ్.. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో.. అతన్ని కాంగ్రెస్ రాజ్యసభకు నామినేట్ చేసింది. ఎంపీగానే కాకుండా.. ఏఐసీసీ కార్యదర్శిగానూ పనిచేసిన రాజీవ్.. ప్రస్తుతం గుజరాత్ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ గా ఉన్నారు.
రాజీవ్ మరణం పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. అతను చాలా సమర్థుడైన నేత అతని, భవిష్యత్ ఆశాకిరణం అని అన్నారు. ఇక, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భావోద్వేగంగా స్పందించారు. ‘‘నా స్నేహితుడు రాజీవ్ సాతవ్ ను కోల్పోయినందుకు బాధగా ఉంది. కాంగ్రెస్ ఆదర్శాలు పుణికిపుచ్చుకున్న సమర్థ నాయకుడు. పార్టీపరంగానే కాకుండా.. వ్యక్తిగతంగానూ నాకు పెద్ద నష్టమే. ఆయన కుటుంబానికి నా సానుభూతి తెలుపుతున్నాను’’ అని రాహుల్ ట్వీట్ చేశారు.