రాజస్థాన్ కీలక నిర్ణయం: పతాంజలి మందుపై నిమ్స్ ఆస్పత్రికి నోటీస్

Update: 2020-06-27 07:45 GMT
వైరస్ నివారణ కు పతంజలి సంస్థ కని పెట్టిన ఆయుర్వేద మందు ’కొరొనిల్’కు కేంద్ర ప్రభుత్వం అడ్డు పుల్లలు వేసింది. ఈ మందు పై రోజు కో వివాదం నడుస్తోంది. ఆ మందు పై రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైరస్ రోగుల పై ట్రయల్స్ నిర్వహించినందుకు సంజాయిషీ ఇవ్వాలంటూ.. రాజస్తాన్ ఆరోగ్య శాఖ.. జైపూర్ లోని నిమ్స్ ఆస్పత్రి కి నోటీసు జారీ చేసింది. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఆస్పత్రి తన చర్య కు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి ని కోర లేదని, ఇలా చేస్తున్నట్టు సమాచారాన్ని కూడా ఇవ్వ లేదని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరోత్తమ్ శర్మ తెలిపారు.

యోగా గురు బాబా రాందేవ్ తీసుకొచ్చిన కొరొనిల్ ఔషధం వరుస వివాదాలను ఎదుర్కొంటోంది. దీని ట్రయల్ పై సమాచారాన్ని ఇవ్వాలని పతంజలి సంస్థ ను ఆయుష్ మంత్రిత్వ శాఖ కోరింది. ఇది వైరస్ రోగుల చికిత్స లో బాగా పని చేస్తుందన్న ప్రచారం పై నిషేధం విధించింది. ఆయుష్ శాఖ అనుమతి లేనిదే ఈ మందును తమ రాష్ట్రం లో రోగులకు వాడరాదని రాజస్థాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

నిబంధనలను అతి క్రమించి ఎవరైనా ఈ మందును అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ హెచ్చరించారు. అటు-ఉత్తరా ఖండ్ ప్రభుత్వం కూడా పతంజలి సంస్థకు నోటీసు జారీ చేయనుంది. దగ్గు, జ్వరాన్ని నివారించి రోగ నిరోధక శక్తిని పెంచే మందుకు  లైసెన్సు కావాలని  మాత్రమే ఈ సంస్థ దరఖాస్తు పెట్టుకుందని ఆ ప్రభుత్వం పేర్కొంది. కాగా బీహార్ లో కూడా ఓ వ్యక్తి ఈ మందు పై కోర్టు లో పిటిషన్ వేశారు. బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ లక్షలాది కరోనా రోగుల జీవితాలతో ఆటలాడుతున్నారని, పతంజలి సంస్థపై చర్య తీసుకోవాలని కోరారు. దీని పై ఈ నెల 30వ తేదీన  కోర్టు లో విచారణ జరగనుంది.

Tags:    

Similar News