ఉభయగోదావరి జిల్లాల పోలీసులకు గత పది రోజులుగా కంటిమీద కునుకులేకుండా చేస్తున్న సైకో సూదిగాడి ఆచూకి తెలియకుండానే ఇవ్వాళ హైదరాబాద్ లో మరో సైకో సూదిగాడి వ్యవహారం కలకలం రేపింది. శనివారం మల్కాజ్గిరి లోని నాలుగో తరగతి చదువుతున్న రమ్య అనే విద్యార్థిని స్కూల్కు వెళుతుండగా సడెన్ గా అక్కడకు వచ్చిన ఓ వ్యక్తి ఆ విద్యార్థినికి మత్తు ఇంజెక్షన్ గుచ్చి పరారయ్యాడు. ఆ బాలిక విలపిస్తుండడంతో స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్యం చేయించారు.
ఒక్కసారిగా రాజధానిలో సైకో ఇంజెక్షన్ ఘటన కలకలం సృష్టించడంతో విద్యార్థినిల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నిన్నటి వరకు ఉభయగోదావరి జిల్లాల్లో సైకో సూదిగాడి బాధితుల సంఖ్య 19కు చేరుకుంది. అక్కడ పోలీసుల నిఘా ఎక్కువవ్వడంతో వాడే ఇక్కడకు వచ్చాడా లేదా ఆ సైకో సూదిగాడిని చూసి ఇక్కడ కూడా ఎవరైనా ఇలా తయారయ్యారా అన్నది తెలియడం లేదు.
సైకో సూదిగాడి ఆగడాలు ముందుగా ఉభయగోదావరి జిల్లాలో ప్రారంభమై తర్వాత తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు విస్తరించాయి. వారం రోజులుగా ఈ దాడులు ఆగకపోవడంతో పోలీసులు ఎక్కడికక్కడ నిఘా పెంచేసి..చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. దీంతో గత మూడు రోజులుగా వీడి హడావిడి లేదు. దీంతో వాడు రూటు మార్చి ఇక్కడకు వచ్చాడా..లేదా ఇక్కడ దాడికి పాల్పడింది వేరే సైకోనా అన్నది తేలాల్సి ఉంది. ఇక్కడ కూడా ఒక్కసారిగా సైకో సూదిగాడి అలజడి రేగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్కు పంపాలంటేనే భయపడుతున్నారు. హైదరాబాద్ పోలీసులు వెంటనే అలర్ట్ అయితే ఇలాంటి అలజడి లేకుండా చేయవచ్చు
ఒక్కసారిగా రాజధానిలో సైకో ఇంజెక్షన్ ఘటన కలకలం సృష్టించడంతో విద్యార్థినిల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నిన్నటి వరకు ఉభయగోదావరి జిల్లాల్లో సైకో సూదిగాడి బాధితుల సంఖ్య 19కు చేరుకుంది. అక్కడ పోలీసుల నిఘా ఎక్కువవ్వడంతో వాడే ఇక్కడకు వచ్చాడా లేదా ఆ సైకో సూదిగాడిని చూసి ఇక్కడ కూడా ఎవరైనా ఇలా తయారయ్యారా అన్నది తెలియడం లేదు.
సైకో సూదిగాడి ఆగడాలు ముందుగా ఉభయగోదావరి జిల్లాలో ప్రారంభమై తర్వాత తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు విస్తరించాయి. వారం రోజులుగా ఈ దాడులు ఆగకపోవడంతో పోలీసులు ఎక్కడికక్కడ నిఘా పెంచేసి..చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. దీంతో గత మూడు రోజులుగా వీడి హడావిడి లేదు. దీంతో వాడు రూటు మార్చి ఇక్కడకు వచ్చాడా..లేదా ఇక్కడ దాడికి పాల్పడింది వేరే సైకోనా అన్నది తేలాల్సి ఉంది. ఇక్కడ కూడా ఒక్కసారిగా సైకో సూదిగాడి అలజడి రేగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్కు పంపాలంటేనే భయపడుతున్నారు. హైదరాబాద్ పోలీసులు వెంటనే అలర్ట్ అయితే ఇలాంటి అలజడి లేకుండా చేయవచ్చు