దేశంలో సంపూర్ణ లాక్ డౌన్ కి కేంద్రం పై ఒత్తిడి !

Update: 2021-05-06 06:37 GMT
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసులు,మరణాల సంఖ్య భారీగా నమోదవుతుంది. రికార్డు స్థాయిలో రోజుకి 3లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నేడు నాలుగు లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో దేశంలో మరోసారి సంపూర్ణ లాక్‌ డౌన్‌ విధించాలని ప్రధాని మోదీపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ అమలు చేసేందుకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం అనుకూలంగా లేదని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని సగానికి పైగా జిల్లాల్లో కరోనా నియంత్రణలో ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అటువంటి పరిస్థితిలో దేశవ్యాప్తంగా గతేడాది మాదిరిగా జాతీయస్థాయి లాక్‌ డౌన్‌ విధించడం కారణంగా పేదలకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది.

దీనితోనే  కొత్త కేసుల పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న రాష్ట్రాలు ఆంక్షలతో కూడిన లాక్‌ డౌన్‌ విధిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాల్లో పరిమిత లేదా పూర్తిస్థాయి లాక్‌ డౌన్‌ విధించారు. దీని ప్రభావం కనిపించడం ప్రారంభమైందని అధికారవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దేశంలోని ఏ రాష్ట్రాల్లో లాక్‌ డౌన్‌ విధించారు , అక్కడ ఏ విధమైన ఆంక్షలు విధించారో చూస్తే ..మహారాష్ట్రలో  ఏప్రిల్‌ 5న కర్ఫ్యూ లాంటి లాక్‌ డౌన్, నిషేధ ఉత్తర్వులతో ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు. నిషేదాజ్ఞలు మే 15 వరకు పొడిగించారు.  ఇక ఢిల్లీలో లాక్‌ డౌన్‌ ను 10వ తేదీ వరకు పొడిగించారు. ఏప్రిల్‌ 19 నుంచి రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ కొనసాగుతోంది. ఉత్తర్‌ ప్రదేశ్‌ లో లాక్‌ డౌన్‌ ను మే 10 వరకు పొడిగించారు.  అలాగే ,ఛత్తీస్‌ గఢ్‌ లో లాక్‌ డౌన్‌ ను మే 15 వరకు పొడిగించారు. ఇక రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులను దృష్టిలో ఉంచుకుని బిహార్‌ ప్రభుత్వం మే 15 వరకు లాక్‌ డౌన్‌ విధించాలని నిర్ణయించింది.  ఒడిశాలో మే 19 వరకు లాక్‌ డౌన్‌ విధించారు. ఒడిశాలో 15 రోజుల లాక్ డౌన్ మే 19 వరకు ఒడిశాలో కొనసాగుతుంది. పంజాబ్‌ లో మినీ లాక్‌ డౌన్, వారాంతపు లాక్‌ డౌన్‌ వంటి చర్యలతో పాటు, విస్తృతమైన ఆంక్షలు ఉన్నాయి.

ఇక రాజస్థాన్‌ లో  లాక్‌ డౌన్‌ ఆంక్షలు మే 17 వరకు అమలులో ఉన్నాయి.  గుజరాత్‌  రాష్ట్రంలోని 29 పట్టణాల్లో నైట్‌ కర్ఫ్యూ కొనసాగుతోంది. బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలు నిషేధించారు.  మధ్యప్రదేశ్‌ లో  కరోనా కర్ఫ్యూ మే 7 వరకు అమలులో ఉంది.అస్సాం లో నైట్‌ కర్ఫ్యూ రాత్రి ఎనిమిది గంటల నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది. నైట్‌ కర్ఫ్యూ మే 7 వరకు అమలులో ఉంటుంది.తమిళనాడులో మే 20 వరకు అన్ని రాజకీయ, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేధంసహా విస్తృతమైన ఆంక్షలు విధించారు.  

కేరళలో  మే 9 వరకు లాక్‌డౌన్‌ తరహా కఠిన ఆంక్షలు ఉన్నాయి. కర్ణాటక: మే 12 వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.   జార్ఖండ్‌ లో  ఏప్రిల్‌ 22 నుంచి మే 6 వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉంది.  గోవాలో  నాలుగు రోజుల లాక్‌ డౌన్‌ సోమవారం ముగిసినప్పటికీ ఉత్తర గోవాలోని కలంగూట్, కాండోలిమ్‌ వంటి పర్యాటక ప్రదేశాలలో లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. కోవిడ్‌ –19 కారణంగా ఆంక్షలు మే 10 వరకు కొనసాగుతాయి.  ఆంధ్రప్రదేశ్‌లో  మే 5వ తేదీ నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు రెండు వారాల పాటు పాక్షిక కర్ఫ్యూ ప్రకటించారు.  తెలంగాణ లో ప్రస్తుతం నైట్‌ కర్ఫ్యూ మే 8 వరకు కొనసాగుతుంది. పుదుచ్చేరిలో  లాక్‌ డౌన్‌ మే 10 వరకు పొడిగించారు.  నాగాలాండ్‌లో  మే 14 వరకు కఠినమైన నిబంధనలతో పాక్షిక లాక్‌ డౌన్‌ విధించారు.  జమ్మూ కశ్మీర్‌ లోని  శ్రీనగర్, బారాముల్లా, బుద్గాం, జమ్మూ జిల్లాల్లో లాక్‌ డౌన్‌ ను మే 6 వరకు పొడగించారు. మొత్తంగా దేశవ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ ను అమలు చేయకపోయినప్పటికీ  కూడా దేశంలో చాలా రాష్ట్రాలు సొంతంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి.
Tags:    

Similar News