జేసీ ఇలాకాలో పంది పందేలు

Update: 2017-01-23 16:06 GMT
వినటానికే విచిత్రంగాఉన్నా ఇది నిజం. ఇప్పటివరకూ జల్లికట్టు గురించి విన్నాం.. కోడి పందేల గురించి విన్నాం. కానీ.. ఈ పంది పందేలేందనిపించొచ్చు. కానీ.. అనంతపురం టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలాకాలో తాజాగా పంది పందేల్ని నిర్వహించారు.

సంక్రాంతి సందర్భంగా కోడి పందేలకు ఆంధ్రానే ఫేమస్. కోడి పందేల్లో రెండు కోళ్ల మధ్య పోటీలు నిర్వహిస్తారు. తాజాగా అనంతపురంలో నిర్వహించిన పంది పందేల్లో రెండు పందుల మధ్యన పోటీలు నిర్వహించారు. కోళ్ల మాదిరే పందులు.. ఒకదానితో ఒకటి పోటీ పడటం వింతగా మారింది.

ఈ పందేల కోసం అనంతపురానికి చెందిన పలువురు పందుల పెంపకందారులు తమ పందుల్ని పోటీకి తీసుకొచ్చారు. ఇప్పటిదాకా కోళ్ల పోటీల్ని మాత్రమే తెలిసిన జనాలు.. పందుల మధ్య నిర్వహించిన పోటీని మహా ఆసక్తిగా చూశారు. రానున్న రోజుల్లో ఈ పందుల పోటీల మీద మరెంత రచ్చ జరుగుతుందో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News