ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన `గడపగడపకు ప్రభుత్వం` కార్యక్రమం చాలా వాడి వేడిగా సాగుతోంది. ఎక్కడికక్కడ.. వైసీపీ నాయకులకు ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం పెంచుతున్న ధరలు.. పెట్రోల్ చార్జీలు, విద్యుత్ ధరల భారం.. ముఖ్యంగా రహదారుల గోతులు.. అభివృద్ధి లేకపోవడం ఇలా.. అనేక అంశాల్లో ప్రజల నుంచి ప్రశ్నల వర్షం కురుస్తోంది. దీనికి తోడు కొన్ని చోట్ల ఇళ్లు, కల్తీ మద్యంపైనా ప్రజలు నిలదీస్తున్నారు. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా అందరినీ ప్రజలు ఏకేస్తున్నారు.
శ్రీకాకుళం నుంచి అనంత పురం వరకు పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత ఉంటోంది. దీనిని గమనించిన చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు ఇంకా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. ఇక, ఇప్పటికే చేపట్టిన కార్యక్రమంలో ఎక్కడా ప్రజల నుంచి ఫేవర్ వచ్చిన సంకేతం కూడా కనిపించడం లేదు. నిజానికి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వస్తుందని.. ఎమ్మెల్యేలకు మంత్రులకు ప్రజల నుంచి బ్రహ్మరథం వస్తుందని భావించారు. కానీ, దీనికి బిన్నంగా ప్రజల నుంచి సెగలు పుడుతున్నాయి.
ఈ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం పై వస్తున్న రెస్పాన్స్ చూసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఆసక్తిగా స్పందించారు. అదేసమయంలో జగన్కు థ్యాంక్స్ చెప్పారు. నిజానికి జగన్ అన్నా వైసీపీ నాయకులు అన్నా ఉప్పు-నిప్పు మాదిరిగా ఉండే లోకేష్ ఇలా థ్యాంక్స్ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. జగన్ రెడ్డి బాదుడే బాదుడు తట్టుకోలేని జనం గడప గడపకీ వస్తున్న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలకు నిలదీతలతో దబిడిదిబిడీ వాయిస్తున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్ పోస్ట్ చేశారు.
వైసీపీ ఎమ్మెల్యేల నిలదీతల పర్వానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన లోకేష్ అటు జగన్ కి పరదాలు, ఇటు వైసీపీ ఎమ్మెల్యే లకు బాదుడు అంటూ పేర్కొన్నారు. అంతేకాదు జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజావ్యతిరేకత ఎంతుందో రాష్ట్రానికి తెలుస్తుందని పేర్కొన్న లోకేష్ గడప గడపలో ఇదే వాయింపుడు తప్పదని ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో సీఎం గారు పరదాలు, వలలు, ముందస్తు అరెస్టులు, దుకాణాలు మూసివేతలుంటేనే బయటకొస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.
``ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఏ రేంజ్లో ఉందో మీ కార్యక్రమం ద్వారా రాష్ట్రమంతటికీ తెలియజేసినందుకు థాంక్స్ జగన్ రెడ్డి గారు `` అంటూ లోకేష్ ప్రజా మద్దతు కోసం జగన్మోహన్ రెడ్డి వేసిన ప్లాన్ బూమరాంగ్ అయిందని ఎద్దేవా చేశారు. జగన్ సర్కార్ పనితీరుకు ప్రజల నుండి వస్తున్న స్పందన చూపించి సెటైర్లు వేస్తున్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల వ్యతిరేకత, నిలదీతలకు సంబంధించిన పలు వీడియోలను లోకేష్ తన ట్విట్టర్లో పోస్టు చేశారు. మరి దీనిపై వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
శ్రీకాకుళం నుంచి అనంత పురం వరకు పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత ఉంటోంది. దీనిని గమనించిన చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు ఇంకా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. ఇక, ఇప్పటికే చేపట్టిన కార్యక్రమంలో ఎక్కడా ప్రజల నుంచి ఫేవర్ వచ్చిన సంకేతం కూడా కనిపించడం లేదు. నిజానికి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వస్తుందని.. ఎమ్మెల్యేలకు మంత్రులకు ప్రజల నుంచి బ్రహ్మరథం వస్తుందని భావించారు. కానీ, దీనికి బిన్నంగా ప్రజల నుంచి సెగలు పుడుతున్నాయి.
ఈ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం పై వస్తున్న రెస్పాన్స్ చూసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఆసక్తిగా స్పందించారు. అదేసమయంలో జగన్కు థ్యాంక్స్ చెప్పారు. నిజానికి జగన్ అన్నా వైసీపీ నాయకులు అన్నా ఉప్పు-నిప్పు మాదిరిగా ఉండే లోకేష్ ఇలా థ్యాంక్స్ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. జగన్ రెడ్డి బాదుడే బాదుడు తట్టుకోలేని జనం గడప గడపకీ వస్తున్న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలకు నిలదీతలతో దబిడిదిబిడీ వాయిస్తున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్ పోస్ట్ చేశారు.
వైసీపీ ఎమ్మెల్యేల నిలదీతల పర్వానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన లోకేష్ అటు జగన్ కి పరదాలు, ఇటు వైసీపీ ఎమ్మెల్యే లకు బాదుడు అంటూ పేర్కొన్నారు. అంతేకాదు జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజావ్యతిరేకత ఎంతుందో రాష్ట్రానికి తెలుస్తుందని పేర్కొన్న లోకేష్ గడప గడపలో ఇదే వాయింపుడు తప్పదని ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో సీఎం గారు పరదాలు, వలలు, ముందస్తు అరెస్టులు, దుకాణాలు మూసివేతలుంటేనే బయటకొస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.
``ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఏ రేంజ్లో ఉందో మీ కార్యక్రమం ద్వారా రాష్ట్రమంతటికీ తెలియజేసినందుకు థాంక్స్ జగన్ రెడ్డి గారు `` అంటూ లోకేష్ ప్రజా మద్దతు కోసం జగన్మోహన్ రెడ్డి వేసిన ప్లాన్ బూమరాంగ్ అయిందని ఎద్దేవా చేశారు. జగన్ సర్కార్ పనితీరుకు ప్రజల నుండి వస్తున్న స్పందన చూపించి సెటైర్లు వేస్తున్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల వ్యతిరేకత, నిలదీతలకు సంబంధించిన పలు వీడియోలను లోకేష్ తన ట్విట్టర్లో పోస్టు చేశారు. మరి దీనిపై వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.