బాబుకు ముఖం చూపించలేకే విందుకు కేసీఆర్‌ డుమ్మా?

Update: 2015-07-01 04:46 GMT
రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్‌ దంపతులు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరు కాలేదు. ఆయన 101 జ్వరంతో బాధ పడుతున్న నేపథ్యంలో విందుకు రాలేకపోతున్నట్లు మంగళవారం ఉదయమే కబురు పెట్టినట్లు చెబుతున్నారు.

మరోవైపు కేసీఆర్‌ గైర్హాజరీపై ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు.. టీడీపీ పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్‌ నారాలోకేశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఎదురుపడే ధైర్యం లేకనే గవర్నర్‌ ఇచ్చిన విందుకు కేసీఆర్‌ రాలేదని ఆరోపించారు. నాలుగు రోజులు ఫాంహౌస్‌లో ఉన్న వ్యక్తికి ఉన్నట్లుండి జ్వరం ఎలా వచ్చిందని ప్రశ్నించారు.

కేసీఆర్‌కు నిజంగా ఆరోగ్యం బాగుందా? లేదా? అన్నది తర్వాత.. తన తండ్రికి ఎదురుపడే ధైర్యం లేకనే కేసీఆర్‌ విందుకు రాకుండా తప్పించుకున్నారన్న ఘాటు వ్యాఖ్యలపై తెలంగాణ అధికారపక్షం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News