హిందువుల జనాభాపై ముస్లిం ఎంపీ హాట్‌ కామెంట్స్‌ వైరల్‌!

Update: 2022-12-03 13:33 GMT
ఆల్‌ ఇండియా డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ చీఫ్, అసోం ఎంపీ బద్రుద్దీన్‌ అజ్మల్‌ హిందువుల జనాభాకు సంబంధించి చేసిన తాజా వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. ముస్లింలతో పోల్చితే హిందువుల జనాభా పడిపోతోందని అజ్మల్‌ వ్యాఖ్యానించారు. ముస్లింల జనాభాతోపాటు హిందువుల జనాభా పెరగాలంటే హిందువులు తమ కుమార్తెలకు 18–20 ఏళ్లలోపే వివాహం చేయాలని సూచించారు.

ముస్లింల జనాభా పెరిగినంత వేగంగా హిందువుల జనాభా పెరగడం లేదని ఎంపీ బద్రుద్దీన్‌ అజ్మల్‌ చెప్పారు. 'హిందువులు సరైన వయస్సులో పెళ్లి చేసుకోరు, వారు 2–3 ఎఫైర్లు నడుపుతారు. కానీ వారు వివాహం చేసుకోరు, వారు 40 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకుంటారు, అది కూడా కుటుంబ ఒత్తిడితో' అంటూ ఎంపీ బద్రుద్దీన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరి 40 ఏళ్ల వయసులో హిందువులు పెళ్లి చేసుకుంటే వాళ్లు ఎక్కువ మంది పిల్లల్ని ఎలా కనగలరని ప్రశ్నించారు.

'మా కమ్యూనిటీలో, అమ్మాయిలకు 18 ఏళ్లు వచ్చిన వెంటనే పెళ్లి చేస్తారు. భారత ప్రభుత్వం దీనిని అనుమతించింది. అబ్బాయిలు 22 ఏళ్లు వచ్చిన వెంటనే పెళ్లి చేసుకుంటారు. అందుకే మన జనాభా పెరుగుతోంది' అని అజ్మల్‌ ఒక వీడియోలో చెప్పాడు.

కాబట్టి 'హిందువులు కూడా తమ కుమార్తెలను 18 సంవత్సరాల వయస్సులో వివాహం చేయాలనే ముస్లింల సూత్రాన్ని అనుసరించాలి' అంటూ వ్యాఖ్యానించారు. అజ్మల్‌ వివాదాస్పద వ్యాఖ్యలపై అసోంలో అధికారంలో ఉన్న అధికార భారతీయ జనతా పార్టీ తీవ్రంగా స్పందించింది.  

అజ్మల్‌ వ్యాఖ్యలపై అస్సాం బీజేపీ ఎమ్మెల్యే డి.కలిత మండిపడ్డారు. "ఇలాంటి మాటలు చెప్పి తల్లిదండ్రులు, సోదరీమణులపై ఆరోపణలు చేస్తున్నారు. దాన్ని నేను ఖండిస్తున్నాను. ఇలాంటి వ్యాఖ్యలను హిందువులు ఒప్పుకోరు. రాజకీయాల కోసం ఇంత దిగజారకండి. తల్లి, సోదరి, వారి గౌరవాన్ని తుంగలో తొక్కకండి" అని కలితా అన్నారు.

'మీరు ముస్లిం, మేము హిందువులం. మేము మీ నుండి నేర్చుకోవాలా? ఇది రాముడు సీతాదేవి ఉన్న దేశం. ఇక్కడ బంగ్లాదేశీయులకు చోటు లేదు. మేము ముస్లింల నుండి నేర్చుకోవలసిన అవసరం లేదు' అని అస్సాం బీజేపీ ఎమ్మెల్యే డి కలిత ఆగ్రహం వ్యక్తం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News