వందెకరాల్లో రిసెప్షనా ?

Update: 2022-08-12 14:36 GMT
ఖమ్మం వైసీపీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులరెడ్డి కూతురు రిసెప్షన్ ఈనెల 17వ తేదీన జరగబోతోంది. వివాహం జరగటం తర్వాత రిసెప్షన్ జరగటం చాలా మామూలే. అయితే ఇక్కడ జగరబోయే రిసెప్షన్ మాత్రం అత్యంత అట్టహాసంగా జరగబోతోంది.

పొంగులేటి అంటేనే రెండు రాష్ట్రాల్లో బాగా సుపరిచితుడైన కాంట్రాక్టర్ కమ్ పొలిటిషియన్. జగన్మోహన్ రెడ్డితో పాటు కేసీయార్ తో కూడా పొంగులేటికి అత్యంత సాన్నిహిత్యముంది.

కూతురు స్వప్నిరెడ్డి వివాహం ఈమధ్యనే ఇండోనేషియా రాజధాని బాలిలో అత్యంత వైభవంగా జరిగింది. వివాహానికి ఇరువైపుల కుటుంబసభ్యులు, దగ్గరి బంధులు మాత్రమే హాజరయ్యారట.

అందుకనే వివాహ రిసెప్షన్ మాత్రం ఘనంగా అంటే బాహుబలి స్ధాయిలో జరగాలని డిసైడ్ అయ్యారు. దానికి తగ్గట్లే ఖమ్మం శివార్లలోని 100 ఎకరాల్లో ఏర్పాట్లుచేస్తున్నారు. ఇంతవరకు తెలంగాణాలోనే జరగనంత ఘనంగా రిసెప్షన్ జరపేందుకు భారీ సెట్టింగులు వేస్తున్నారు.

వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా సొంతఖర్చులతో ఏకంగా ఒక కెనాల్ పైన బ్రిడ్జీని నిర్మిస్తున్నారట. వాహనాలు పార్కింగ్, భోజనాలకు, వీవీఐపీల రాకకకోసం అవసరమైన ఏర్పాట్లన్నింటినీ చేస్తున్నారు. రిసెప్షన్ కు ఇద్దరు తెలుగుముఖ్యమంత్రులతో పాటు మంత్రివర్గాలు, వివిధ రంగాల్లోని ప్రముఖులంతా హాజరవుతారని చెప్పుకుంటున్నారు.
Tags:    

Similar News