భార్య‌ను చంపి టీవీ లైవ్‌ లో చెప్పిన భ‌ర్త‌

Update: 2015-08-29 09:44 GMT
ఎప్పుడు ఏం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి. బ‌య‌ట వ్య‌క్తుల‌తోనే కాదు.. ఇంట్లో వారితోనూ ఎప్పుడూ ఎవ‌రు ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో అన్న సందేహం క‌లిగే ఉదంతాలు త‌ర‌చూ చోటు చేసుకుంటున్నాయి.

తాజాగా అలాంటి ఉదంత‌మే క‌ర్ణాట‌క రాష్ట్ర రాజ‌ధాని బెంగ‌ళూరులో చోటు చేసుకుంది. న‌గ‌రంలోని చాంరాజ్‌ పేట‌కు చెందిన ఒక వ్య‌క్తి త‌న భార్య‌ను కిరాత‌కంగా చంపేయ‌ట‌మే కాదు.. మృత‌దేహాన్ని కారులో తీసుకొని.. ఒక ప్ర‌ముఖ టీవీ ఛాన‌ల్ వ‌ద్ద‌కు వెళ్లారు. లైవ్ లో త‌న భార్య‌ను ఎందుకు చంపింద‌న్న విష‌యాన్ని వెల్ల‌డించ‌టంతో పాటు.. తాను ఎలా చంపాన‌న్న విష‌యాన్ని చెప్ప‌టం సంచ‌ల‌నం సృష్టించింది.

నిందితుడు త‌ప్పించుకోకుండా ఉండ‌టంతోపాటు.. అతను చెప్పిన వాద‌న‌ను పోలీసుల కేసు విచార‌ణ‌కు ప‌నికి వ‌స్తుంద‌న్న ఉద్దేశంతో స‌ద‌రు టీవీ ఛాన‌ల్ లైవ్ ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

భార్య‌ను చంపిన క‌సాయి వాద‌న ఏమిటంటే.. త‌న భార్య‌తో ప‌దేళ్ల క్రితం పెళ్లి అయ్యింద‌ని.. అయితే త‌న చిట్‌ ఫండ్ స్నేహితుడితో ఆమె అక్ర‌మ సంబంధం క‌లిగి ఉంద‌ని పేర్కొన్నారు. దీని గురించి స‌మాచారం తెలిసిన నాటి నుంచి త‌మ మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయ‌ని.. తాజాగా ఆమెను చంపేసిన‌ట్లు వెల్ల‌డించాడు.

టీవీ ఛాన‌ల్ లో లైవ్ పూర్త‌య్యే స‌మ‌యానికి ఛాన‌ల్ వ‌ద్ద‌కు చేరుకున్న పోలీసులు.. అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదంతంపై విచారించిన పోలీసుల‌కు.. నెల క్రితం అత‌ను ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకోబోయాడ‌ని.. త‌న ముగ్గురు పిల్ల‌ల్ని కూడా చంపేందుకు ప్ర‌య‌త్నించార‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News