తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్టులపై కీలక నివేదిక
తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక్కటే పెద్ద సిటీ హైదరాబాద్. ఈ రాజధాని నగరం తప్పితే పెద్దగా మరో సిటీ లేదు. తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్ కు కూడా విమానాశ్రయం లేకపోవడం లోటుయే.. అందుకే తెలంగాణలో కొత్తగా విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఎయిర్ పోర్టుల టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ తుది రిపోర్టులు కేంద్రం నుంచి తాజాగా అందాయి. మొత్తం తెలంగాణలో ఆరు నిర్మాణం చేపట్టేందుకు రెడీ కాగా అందులో మూడు మాత్రమే పూర్త స్థాయిలో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి అనుకూలం అని.. పెద్ద విమానాల రాకపోకలకు అనుకూలమరి.. మరో మూడు అందుకు అనుకూలంగా లేవని ఎయిర్ పోర్టుల అథారిటీ తేల్చింది.
తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయతలపెట్టిన ఎయిర్ పోర్టుల ఏర్పాటు, విమాన రాకపోకల సాధ్యాసాధ్యాలు, వాటి వల్ల కలిగే లాభనష్టాలను భారత విమానయాన సంస్థ బేరీజు వేసింది. మొత్తం ఆరింటిలో 3 మాత్రమే అన్ని రకాలా తగిన విధంగా ఉన్నాయని ఎయిర్ పోర్ట్ అథారిటీ తన నివేదికలో తెలిపింది.
ఇప్పటికే తెలంగాణలో క్షేత్రస్థాయిలో సందర్శన చేసిన కేంద్రబృందాలు.. వరంగల్ లోని మామూనూర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లోని జక్రాన్ పల్లిలు మాత్రమే పూర్తి స్థాయి విమానాశ్రయాలకు అనుకూలంగా ఉన్నాయని నివేదించాయి.
భద్రాద్రి కొత్తగూడేంలోని పాల్వంచ, మహబూబ్ నగర్ లోని దేవరకద్ర, పెద్దపల్లిలోని బసంత్ నగర్ ఎయిర్ పోర్టుల ఏర్పాటు, పెద్ద విమానాల రాకపోకలకు అంతగా అనుకూలంగా లేవని భారత విమానయాన సంస్థ రిపోర్టులో పేర్కొంది. దీంతో ఈ మూడు జిల్లాల ప్రజలకు నిరాశ ఎదురైంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఎయిర్ పోర్టుల టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ తుది రిపోర్టులు కేంద్రం నుంచి తాజాగా అందాయి. మొత్తం తెలంగాణలో ఆరు నిర్మాణం చేపట్టేందుకు రెడీ కాగా అందులో మూడు మాత్రమే పూర్త స్థాయిలో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి అనుకూలం అని.. పెద్ద విమానాల రాకపోకలకు అనుకూలమరి.. మరో మూడు అందుకు అనుకూలంగా లేవని ఎయిర్ పోర్టుల అథారిటీ తేల్చింది.
తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయతలపెట్టిన ఎయిర్ పోర్టుల ఏర్పాటు, విమాన రాకపోకల సాధ్యాసాధ్యాలు, వాటి వల్ల కలిగే లాభనష్టాలను భారత విమానయాన సంస్థ బేరీజు వేసింది. మొత్తం ఆరింటిలో 3 మాత్రమే అన్ని రకాలా తగిన విధంగా ఉన్నాయని ఎయిర్ పోర్ట్ అథారిటీ తన నివేదికలో తెలిపింది.
ఇప్పటికే తెలంగాణలో క్షేత్రస్థాయిలో సందర్శన చేసిన కేంద్రబృందాలు.. వరంగల్ లోని మామూనూర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లోని జక్రాన్ పల్లిలు మాత్రమే పూర్తి స్థాయి విమానాశ్రయాలకు అనుకూలంగా ఉన్నాయని నివేదించాయి.
భద్రాద్రి కొత్తగూడేంలోని పాల్వంచ, మహబూబ్ నగర్ లోని దేవరకద్ర, పెద్దపల్లిలోని బసంత్ నగర్ ఎయిర్ పోర్టుల ఏర్పాటు, పెద్ద విమానాల రాకపోకలకు అంతగా అనుకూలంగా లేవని భారత విమానయాన సంస్థ రిపోర్టులో పేర్కొంది. దీంతో ఈ మూడు జిల్లాల ప్రజలకు నిరాశ ఎదురైంది.