జ‌గ‌న్ అంత మొగోడా అంటున్న టీడీపీ ఎంపీ

Update: 2017-05-23 14:20 GMT
తెలుగుదేశం పార్టీ ఎంపీలు మ‌రోమారు విప‌క్ష‌నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి బూతు పురాణం అందుకున్నారు. సంద‌ర్భం ఏదైనా జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ‌ట‌మే ల‌క్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు వేర్వేరు చోట్ల విమ‌ర్శ‌లు చేశారు. కృష్ణా జిల్లా రామిరెడ్డిపల్లి గ్రామంలో మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్ర‌తిప‌క్ష నేత‌ జగన్ పై ఫైర్ అయ్యారు. ``జగన్ మెహన్ రెడ్డి నీవు ఎంత మగాడివి? చంద్రబాబు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయమని గవర్నర్ ని ప్రధానమంత్రి మోడి ని కలిశావు! నీ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు`` అంటూ చిందులు తొక్కారు.

అన్నాడీఎంకే నాయకురాలు శశికళ 60 కోట్లు కుంభకోణం చేసినందుకు 4సంవత్సరాలు  జైలు శిక్ష అనుభవిస్తోంద‌ని, 12 కేసుల్లో ముద్దాయి అయిన జగన్ మెహన్ రెడ్డికి 200 సంవత్సరాలు జైలు శిక్ష తప్పదని కేశినేని నాని జోస్యం చెప్పారు. వైఎస్ జగన్ మెహన్ రెడ్డి అధికారంలో కి వస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రౌడీలు గ్రామాల్లో పడి దోచుకుతింటార‌ని నాని వ్యాఖ్యానించారు. జగన్ మెహన్ రెడ్డి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్లు ఉంద‌ని నాని విమ‌ర్శించారు.
Read more!

కాగా, తెలుగుదేశం పార్టీకే చెందిన అనంత‌పురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌ సీఎం అయితే రాష్ట్రం సర్వ నాశనమవుతుందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబుకు మరో ఐదేళ్లు సీఎంగా అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. దూరదృష్టి ఉన్న నాయకులు సీఎం చంద్రబాబు నాయుడని జేసీ దివాక‌ర్ రెడ్డి కొనియాడారు.  చంద్రబాబును ఎవరైనా విమర్శిస్తే పాపం త‌గులుతుంద‌ని జేసీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఉంటేనే తాగునీరు, సాగునీరు వస్తోందని... ఇంకెవ్వడు వచ్చినా అవి దొరకవని జేసీ వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News