అభిమానుల దివెనలతో కోలుకుంటున్నా.. కపిల్ ఉద్వేగభరిత పోస్ట్
భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ (61) ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. గురువారం అర్ధరాత్రి కపిల్దేవ్ గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో క్రికెట్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. కపిల్ త్వరగా కోలుకోవాలంటూ ఫ్యాన్స్ పూజలు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి కపిల్దేవ్ ఇన్స్టా వేదికగా స్పందించారు. ‘అభిమానుల ఆశీర్వాదం, దేవుడి దయతో నేను క్షేమంగా ఉన్నాను. నా ఆరోగ్యం కోసం భగవంతుడిని ప్రార్థించిన నా అభిమానులు, శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటాను. మీ అభిమానంతో మీరిచ్చిన దీవెనలతో నేను త్వరగా కోలుకుంటున్నాను’bఅంటూ కపిల్ పేర్కొన్నారు. గురువారం అర్ధరాత్రి కపిల్కు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఢిల్లీ లోని ఓఖ్లా లోని ఫోర్టిస్ ఆసుపత్రి లో చేర్పించారు. అతడికి యాంజియోప్లాస్టీ చికిత్స చేశామని... ప్రస్తుతం ఆరోగ్యం నిలకడ గానే ఉందని వైద్యులు తెలిపారు.
అయితే ఇప్పటికీ కపిల్ ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మరో రెండ్రోజుల్లో డిశార్జి అయ్యే అవకాశం ఉన్నదని వైద్యులు తెలిపారు. భారత్కు తొలి ప్రపంచకప్ (1983) తీసుకురావడంలో కపిల్దేవ్ కీలకపాత్ర పోషించారు. భారత్ తరఫున 131 టెస్టులు, 225 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 5248 పరుగులతో పాటు 434 వికెట్లు తీశాడు. వన్డేల్లో 3783 పరుగులు, 253 వికెట్లు సాధించాడు.
టేక్కేర్ పాజీ..
కపిల్ త్వరగా కోలుకోవాలని టీమిండియా క్రికెటర్లు, మాజీలు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్లు చేశారు. సచిన్ టెండూల్కర్, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా, మాజీ క్రికెటర్ మదన్లాల్ ట్వీట్లు చేశారు. గెట్వెల్ సూన్ పాజీ!'అంటూ సచిన్ ట్వీట్ చేశారు. 'మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. గెట్ వెల్ సూన్ పాజీ.'అని విరాట్ కోహ్లీ ఆకాక్షించాడు.
అయితే ఇప్పటికీ కపిల్ ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మరో రెండ్రోజుల్లో డిశార్జి అయ్యే అవకాశం ఉన్నదని వైద్యులు తెలిపారు. భారత్కు తొలి ప్రపంచకప్ (1983) తీసుకురావడంలో కపిల్దేవ్ కీలకపాత్ర పోషించారు. భారత్ తరఫున 131 టెస్టులు, 225 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 5248 పరుగులతో పాటు 434 వికెట్లు తీశాడు. వన్డేల్లో 3783 పరుగులు, 253 వికెట్లు సాధించాడు.
టేక్కేర్ పాజీ..
కపిల్ త్వరగా కోలుకోవాలని టీమిండియా క్రికెటర్లు, మాజీలు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్లు చేశారు. సచిన్ టెండూల్కర్, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా, మాజీ క్రికెటర్ మదన్లాల్ ట్వీట్లు చేశారు. గెట్వెల్ సూన్ పాజీ!'అంటూ సచిన్ ట్వీట్ చేశారు. 'మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. గెట్ వెల్ సూన్ పాజీ.'అని విరాట్ కోహ్లీ ఆకాక్షించాడు.