దేశంలో మొట్టమొదటి అండర్‌ వాటర్‌ మెట్రో రంగం సిద్ధం!

Update: 2020-01-29 03:30 GMT
కోల్ కత్తా లోని  హుగ్లీ నదిని దాటుతూ పరుగులు పెట్టే తొలి అండర్‌ వాటర్‌ మెట్రో ఈస్ట్‌ - వెస్ట్‌ ప్రాజెక్టును కోల్‌ కతా మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ త్వరలో ప్రారంభించబోతుంది. ఈ ప్రాజెక్ట్ ని 1984లో చేపట్టిన భారత్ ..ఎన్నో సవాళ్ళని  - ఎన్నో అవాంతరాలని - వ్యయ అంచనాలను అధిగమించి నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్  2022 మార్చి   నాటికి అందుబాటులోకి  రాబోతుంది. భారత రైల్వే బోర్డు నుంచి చివరి వాయిదాగా రూ 20 కోట్లు మైట్రో రైల్‌ అథారిటీకి అందనుండగా విస్తరణలో భాగంగా చేపట్టిన అండర్‌ వాటర్‌ మెట్రో పనులు కూడా  తుది దశకు చేరుకున్నాయి.

ఇకపోతే , దాదాపు రూ .10,000 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకి  49 శాతం మేరకు జపాన్‌ ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌ ఏజెన్సీ నిధులు సమకూర్చింది. న్యూలైన్‌ లో రోజుకు 9 లక్షల మంది అంటే నగర జనాభాలో 20 శాతం మంది ప్రయాణిస్తారు. 520 మీటర్ల అండర్‌ వాటర్‌ టన్నెల్‌ ను ఈ రైలు కేవలం నిమిషం లోపే దాటుతుందని అధికారులు వెల్లడించారు.
Tags:    

Similar News