తనను సీఎం చేస్తే 150 ఏళ్లు బతికే సీక్రెట్ చేస్తాడట

Update: 2023-05-30 09:55 GMT
సంచలన వ్యాఖ్య చేశారు సీనియర్ సినీ నటుడు.. ఎస్ఎంకే అధ్యక్షుడు శరత్ కుమార్. తనను ముఖ్యమంత్రి ని చేస్తే 150 ఏళ్లు బతికే రహస్యాన్ని తాను వెల్లడిస్తానని ఆయన వ్యాఖ్యానించటం విశేషం. మదురై పళంగానత్తంలో అఖిల భారత సమత్తువ మక్కల్ కట్చి ఏడో బహిరంగ సభ జరిగింది. ఈ సభకు అధ్యక్షత వహించిన శరత్ కుమార్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన 150 ఏళ్లు జీవించే రహస్యాన్ని తాను ఇటీవల కనుగొన్నట్లుగా పేర్కొన్నారు.

మద్యం దేహాన్ని కుంగదీస్తుందని.. మానసిక ఒత్తిడికి గురి చేస్తుందన్నారు. గంజాయి.. గుట్కా తదితర వాడకాలతో కలిగే నష్టాల గురించి చెప్పారు. 2025 నాటికి దేశంలో అత్యధిక యువకులు ఉంటారని.. ప్రపంచంలో అత్యంత యూత్ ఫుల్ కంట్రీ అవుతుందన్నారు. భారత్ లోని యువశక్తిని నియంత్రించేందుకు విదేశాల నుంచి మత్తు పదార్థాల ను అక్రమంగా రవాణా చేస్తున్నట్లుగా చెప్పారు.

తన వయసు 69 ఏళ్లుగా చెప్పిన ఆయన.. తాను 150 ఏళ్లు జీవించే రహస్యాన్ని తాను కనుగొన్నట్లుగా చెప్పారు. 2026లో తన ను తమిళనాడు ముఖ్యమంత్రి ని చేయాలని ప్రజల్ని కోరారు. తాను ముఖ్యమంత్రి ని అయితే 150 ఏళ్లు ఎలా బతకొచ్చన్న రహస్యాన్ని చెబుతానని చెప్పారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని స్టాలిన్ ప్రభుత్వాన్ని కోరారు. శరత్ కుమార్ మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి.

కానీ.. ఆయన అప్పుడప్పుడు అనారోగ్యానికి గురై..ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుంటారు కదా? 150 ఏళ్లు జీవించే రహస్యాన్ని కనుగొన్న ఆయన.. అప్పుడప్పుడు అనారోగ్యం పాలై ఆసుపత్రి కి వెళ్లకుండా జీవించే రహస్యాన్ని కూడా కనుగుంటే బాగుంటుంది కదా?

Similar News