టీడీపీ జనంలోకి.. పాలన గాలికి..

Update: 2016-11-08 19:30 GMT
అధికార తెలుగుదేశం పార్టీ గత వారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన జనచైతన్య యాత్ర - పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల కారణంగా వెలగపూడిలోని సచివాలయం వెలవెలబోతోంది. మరోవైపు సచివాయంలో ఉన్న ఉన్నతాధికారులు ఆయా శాఖలకు సంబంధించిన పనుల తీరుపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుండటంతో సచివాయంలో తమ ఫిర్యాదులు అందించడానికి వచ్చేవారికి సమాధానం ఇచ్చేవారే లేరు.

గత మంగళవారం ప్రారంభమైన పార్టీ జనచైతన్యయాత్ర - సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జోరుగా సాగుతుండగా.. తమ సమస్యలను పట్టించుకోవాలంటూ వెలగపూడిలోని సచివాలయం మెయిన్‌ గేటు వద్ద సందర్శకులు సెక్యూరిటీ సిబ్బందితో వాదనలకు దిగాల్సివస్తోంది. ముఖ్యంగా మున్సిపల్‌ పరిపాలనాధికారులకు తమ ఫిర్యాదులు ఇచ్చేవారి సంఖ్య భారీగా ఉంది. సోమవారం దాదాపు 45 మందికిపైగా తమ వ్యక్తిగత ఫిర్యాదులు ఇచ్చేందుకు సచివాలయానికి రాగా అధికారులు అందుబాటులో లేని కారణంగా నిరీక్షణ - వెనుదిరగడం తప్పలేదు.

వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు - కార్యదర్శులు - ముఖ్యకార్యదర్శులు ఆయాశాఖల పనితీరుపై సమీక్షా సమావేశాలను నిర్వహించి, జనచైతన్యయాత్రలు పూర్తయిన వెంటనే ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చే కార్యక్రమంలో నిమగ్నమైఉన్నారు. దీంతో సందర్శకుల అర్జీలను తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News