ఆ ఉద్యోగులకి గుడ్ న్యూస్ ...170 శాతం జీతాలు పెంచిన కేంద్రం !
దేశంలో వైరస్ కరాళనృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకి భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించే ఉద్యోగులకు భారీగా జీతాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రహదారుల నిర్మాణం, మౌలిక ప్రాజెక్టుల్లో పనిచేసే ఉద్యోగులకు భారీగా వేతన పెంపు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ప్రాంతాల్లో పనిచేసే సిబ్బంది కనీస వేతనాన్ని 100 నుంచి 170 శాతానికి ప్రభుత్వం పెంచింది. పెరిగిన వేతనాలు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని జాతీయ హైవేలు మౌలిక రంగ అభివృద్ధి కార్పొరేషన్ వెల్లడించింది.జాతీయ హైవేలు.. మౌలిక రంగ అభివృద్ది కార్పొరేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల సరిహద్దుల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ వేతన పెంపు వర్తించనుంది.
తాజా ఉత్తర్వుల ప్రకారం డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి సాంకేతికేతర సిబ్బంది వేతనం నెలకు ప్రస్తుతమున్న 16,770 రూపాయల నుంచి 41,440 రూపాయలకు పెరిగింది. ఇక ఢిల్లీలో ఇదే పోస్టులో పనిచేసే వ్యక్తి వేతనం 28,000 రూపాయలు కావడం గమనార్హం. వేతన ప్రయోజనాలతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులు రూ పది లక్షల ప్రమాద బీమాను పొందుతారు.
ఈ ప్రాంతాల్లో పనిచేసే సిబ్బంది కనీస వేతనాన్ని 100 నుంచి 170 శాతానికి ప్రభుత్వం పెంచింది. పెరిగిన వేతనాలు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని జాతీయ హైవేలు మౌలిక రంగ అభివృద్ధి కార్పొరేషన్ వెల్లడించింది.జాతీయ హైవేలు.. మౌలిక రంగ అభివృద్ది కార్పొరేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల సరిహద్దుల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ వేతన పెంపు వర్తించనుంది.
తాజా ఉత్తర్వుల ప్రకారం డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి సాంకేతికేతర సిబ్బంది వేతనం నెలకు ప్రస్తుతమున్న 16,770 రూపాయల నుంచి 41,440 రూపాయలకు పెరిగింది. ఇక ఢిల్లీలో ఇదే పోస్టులో పనిచేసే వ్యక్తి వేతనం 28,000 రూపాయలు కావడం గమనార్హం. వేతన ప్రయోజనాలతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులు రూ పది లక్షల ప్రమాద బీమాను పొందుతారు.