సర్ ప్రైజ్.. జనసేనలోకి భారత మాజీ క్రికెటర్

Update: 2018-06-28 09:47 GMT

భారత జట్టుకు ఆడి రిటైర్ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన క్రికెటర్ వేణుగోపాల రావు ఆశ్చర్యకరంగా ఈరోజు జనసేన పార్టీలో చేరారు. జనసేనాని ప్రస్తుతం గురువారం విశాఖ పట్నం లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సమక్షంలో  వేణుగోపాల్ రావు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వేణుగోపాల్ రావు చేరిక సందర్భంగా పవన్ కళ్యాన్ విలేకరులతో మాట్లాడారు.

తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన పార్టీ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు - పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

భారత్ తరఫున వేణుగోపాల్ రావు 2005లో అరంగేట్రం చేశాడు. శ్రీలంకతో తొలివన్డే ఆడాడు. 2006లో వెస్టిండీస్ తో చివరి వన్డే ఆడాడు. మొత్తం 16 మ్యాచ్ లు ఆడిన వేణు గోపాల్ రావు తరువాత రిటైర్ అయ్యి ప్రస్తుతం రాజకీయాలపై ఆసక్తితో జనసేనలో చేరారు. 
Tags:    

Similar News