ప్రకాశంలో తీవ్ర విషాదం: శానిటైజర్ తాగి 8 మంది మృతి !

Update: 2020-07-31 08:10 GMT
ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శానిటైజర్ తాగి ఏకంగా ఎనిమిది చ‌నిపోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. కురిచేడు అమ్మవారి ఆలయం దగ్గర జీవ‌నం సాగించే యాచకులు మద్యానికి బానిసలుగా మారారు. అయితే ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధం లో భాగంగా ఇటీవలే  మ‌ద్యం ధ‌ర‌లు విప‌రీతంగా పెంచింది. మద్యం ధరలు భారీగా పెరగడంతో.. వీరందరూ  గ‌త కొద్ది రోజులుగా వారు శానిటైజర్లు సేవిస్తున్న‌ట్లు తెలుస్తుంది. దీనితో గురువారం రాత్రి కడుపులో మంటతో ఓ వ్యక్తి ప్రాణాలు విడిచాడు. మరో వ్యక్తి కూడా తీవ్ర అనారోగ్యానికి గురి కావ‌డంతో స్థానికులు 108కు సమాచారం అందించారు. వెంటనే అతడ్ని దర్శి గ‌వ‌ర్న‌మెంట్ ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా..అక్కడ చికిత్స పొందుతూ చ‌నిపోయాడు.

అలాగే ,  కురిచేడులోని పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఉండే రమణయ్య గురువారం ఉదయం శానిటైజర్‌, నాటు సారా కలిపి తాగుతుండగా స్థానికులు గుర్తించి వద్దని వాదించారు. కానీ అప్పటికే తాగేశాడు. తర్వాత ఇంటికి వెళ్లిపోయాడు. అతడు కూడా అపస్మారక స్థితిలో పడిపోగా.. కుటుంబసభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. అతడ్ని దర్శి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. ఇదిలా ఉంటే శుక్రవారం కూడా మరో ఐదుగురు దర్శి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయినట్లు తెలుస్తోంది. ఒకే యాచకుల బృందానికి చెందిన వీరందరూ వేరు వేరు ప్రాంతాల్లో తిరుగుతూ మృతి చెందినట్టు గుర్తించారు పోలీసులు. వీరంతా శానిటైజర్ తాగారా..లేక నాటుసారా తాగి చ‌నిపోయారా అన్న కోణంలో పోలీసు విచారణ మొదలుపెట్టారు.
Tags:    

Similar News