పెళ్లిలోనూ కరోనా భయం.. భీతావాహ దృశ్యం

Update: 2020-07-25 04:15 GMT
ఒకప్పుడు పెళ్లంటే ఆకాశమంతా పందరి వేసి.. భూదేవంతా చాపలు వేసి అంగరంగ వైభవంగా చేసేవారు. చైనా నుంచి ఊడిపడ్డ కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు పెళ్లంటే ఒక భయోత్పాతంగా మారింది. కరోనా విస్తరించే వేడుకలంటేనే అందరూ హడలి చస్తున్నారు.

కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న వేళ.. వివాహ.. ఇతర శుభకార్యాలను అతి తక్కువమందితో నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు విధించాయి.

తాజాగా కృష్ణ జిల్లాలోని ముదినేపల్లిలో నిర్వహించిన ఓ వివాహ వేడుకలో క్యాటరింగ్ సిబ్బంది వినూత్నంగా భోజనాలు వడ్డించడం అందరినీ షాక్ కు గురిచేసింది.

కరోనా వైరస్ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని వివాహానికి వచ్చిన బంధువులు.. అతిథులకు క్యాటరింగ్ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి ఆస్పత్రిలో రోగులకు సేవలు చేసినట్టు చేయడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. ఆ పీపీఈ కిట్స్ తోనే భోజనాలు వడ్డించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 
Tags:    

Similar News