ఓపెన్ గా తుపాకీ తీసే బెదిరించాడు

Update: 2015-10-13 07:57 GMT
రాజకీయ నేతల మధ్య వివాదాలు మామూలే. కానీ.. అవి నిన్నమొన్నటి వరకూ హద్దుల్లోనే ఉండేవి. ఘాటుగా విమర్శలు.. ఆరోపణలు స్థాయి నుంచి కొట్టుకోవటం మొదలైంది. రాజకీయంగా ఎన్ని విభేధాలు ఉన్నా అవి హద్దుల్లో ఉండేవి. తాజాగా అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది.

తాజాగా తెలంగాణలోని వరంగల్ జిల్లా హన్మకొండలో చోటు చేసుకున్న భూవివాదం కాంగ్రెస్.. తెలుగుదేశం నేతల మధ్య కొత్త వివాదానికి కారణమైంది. ఈ వివాదానికి సంబంధించి పూర్తి సమాచారం బయటకు రానప్పటికీ.. వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డికి.. టీడీపీ అర్బన్ అధ్యక్షుడికి మధ్య మాటలు హద్దులు దాటాయి.  

అదే సమయంలో ఇరువురు నేతలు.. తమ వర్గీయులతో ఎదురెదురు పడటం.. ఒకరినికొకరు మాటలు అనుకోవటం జరిగింది. ఈ సందర్భంగా తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాజేందర్ రెడ్డి తుపాకీని బయటకు తీసి బెదిరించటం సంచలనం సృష్టించింది. ఒక పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ.. ఓపెన్ గా తుపాకీ చూపించి బెదిరించే పరిస్థితి రావటం చూస్తే.. రానున్న రోజుల్లో రాజకీయ నేతల మధ్య వైరం మరెంత ముదిరిపోతుందోనన్న సందేహం కలగటం ఖాయం.
Tags:    

Similar News