పవన్ కంటే చిరునే బెటర్ అంటున్న రోజా

Update: 2017-03-27 16:24 GMT
మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పైర్ బ్రాండ్ రోజా.. చిరుపై ఘాటుగానే విమర్శించేవారు. ఏ పార్టీ కండువా భుజాన వేసుకుంటారో..  ఆ పార్టీకి తన నోటి మాటలతో నూటికి నూరు శాతం న్యాయం చేసే అలవాటున్న రోజా.. అప్పట్లో చిరుపై చిర్రుబుర్రులు ఆడేవారు. ఆయన నిర్ణయాల్ని ఆమె తెర మీదకు తీసుకొచ్చే పాయింట్లు.. లేవనెత్తే లాజిక్కులు చాలామంది దృష్టిని ఆకర్షించేవి. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆమె విమర్శలు సంధించారు.

పార్టీ పెట్టి మూడేళ్లు అవుతున్నా.. ఇప్పటివరకూ పవన్ కల్యాణ్ సాధించిందేమిటో చెప్పాలంటూ సూటిగా ప్రశ్నించారు. తప్పు జరిగితే ప్రశ్నిస్తానంటూ మాటలు చెప్పిన పవన్.. మోడీ.. చంద్రబాబులకు జైకొడుతూసైలెంట్ గా కూర్చున్నారే కానీ.. ఇంకేం చేయలేదని ఎద్దేవా చేశారు.

జనసేన పార్టీని పెట్టిన పవన్.. ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో ఇంతవరకూ ఎందుకు  పోటీ చేయలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావన తెచ్చిన ఆమె.. పవన్ కంటే చిరంజీవే మేలని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పోటీ చేసి కొన్ని సీట్లు అయినా గెలిచారన్న ఆమె..పవన్ తీరును తీవ్రంగా తప్పు పట్టారు.

రాజకీయాలకు పవన్ కల్యాణ్ కొత్తేమీ కాకున్నా..పార్టీ పెట్టి ఆయన సాధించిందేమీ లేదన్నారు. రానున్న ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీ కారణంగా ఎలాంటి ప్రభావం ఉండదన్న ఆమె.. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టటం వల్ల ఎలాంటి ప్రయోజనం జరగలేదంటూ ఫైర్ అయ్యారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News