చైనా-పాక్ కుట్ర.. మరో బయో వెపన్ తయారీ?
కరోనా వైరస్ ను పుట్టించిన చైనాపై ఇప్పటికీ అమెరికా సహా ప్రపంచదేశాలన్నీ అనుమానంగా చూస్తున్నాయి. ఇది వూహాన్ ల్యాబ్ లోనే తయారు చేశారని.. ఇది ఒక జీవాయుధం (బయో వెపన్) అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా వివిధ దేశాలు ఆరోపించాయి. కరోనా వైరస్ కు మందు దొరకకపోవడం.. తగ్గకపోవడం.. వ్యాక్సిన్ ఆలస్యం అవుతున్న దృష్ట్యా ఇది బయో వెపన్ అన్న అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి. అందుకే అందరూ చైనాను ఇప్పుడు దోషిగానే చూస్తున్నారు.
ఈ క్రమంలోనే అభాసుపాలవుతున్న చైనా ఇప్పుడు తన చేతికి మట్టి అంటకుండా మిత్రదేశం పాకిస్తాన్ లో ఓ కొత్త బయో వెపన్ తయారు చేయడానికి పూనుకుందనే అనుమానాలను తాజాగా ఆస్ట్రేలియా పత్రిక ‘ద క్లాకన్’ వ్యక్తం చేసింది. ఈ పరిశోధక పత్రిక తాజాగా ఆంథ్రాక్స్ తరహా అత్యంత ప్రమాదకర వైరస్ లు.. బ్యాక్టీరియాల అభివృద్ధికి చైనా-పాకిస్తాన్ కలిసి రహస్య ప్రాజెక్టును నడుపుతున్నాయని సంచలన కథనాన్ని ప్రచురించింది.
చైనా తన మిత్ర దేశం పాకిస్తాన్ తో కలిసి ఈ కొత్త బయోవెపన్ ను భారత సరిహద్దుల్లోని పాకిస్తాన్ లో గల రావల్పిండిలో ఉన్న ‘డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్’ ల్యాబ్ లో తయారీకి పరిశోధనలు చేస్తున్నారని పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. దీనికి సంబంధించి పాకిస్తాన్ సైన్యానికి చెందిన గల రావల్పిండిలో ఉన్న ‘డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్’తో చైనా ఒప్పంద చేసుకున్నట్టు పత్రిక తెలిపింది.
విశేషం ఏంటంటే ఈ భారీ బయో వెపన్ ఖర్చు అంతా చైనాదేనట.. కానీ చైనా భూభాగంలో చేయకుండా పాకిస్తాన్ లో ప్రయోగాలు చేస్తుందని పత్రిక తెలిపింది. ఇందులో పాకిస్తాన్ ఆరోగ్యశాఖకు.. పాకిస్తాన్ యూనివర్సిటీలకు పాత్ర లేకుండా మొత్తం స్వయం ప్రతిపత్తి గల రావల్పిండి ‘డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్’కు అప్పగించడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొంది. ఇందులో మొత్తం చైనీస్ పరిశోధకులే తతంగం నడిపిస్తున్నారని తేలింది.
ఆంత్రాక్స్ జాతికి చెందిన ‘సీసీహెచ్.ఎఫ్.వీ’ అనే వైరల్ ఫీవర్ పై పాకిస్తాన్ లో చైనా సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. ఈ వైరల్ ఫీవర్ తో 25శాతం మంది ప్రపంచవ్యాప్తంగా మరణించే అవకాశం ఉందని సమాచారం.. అంతటి భయంకరమైన వైరల్ రకం జ్వరం వచ్చిన వ్యక్తులు కోలుకోవడం చాలా కష్టం అని చైనా పరిశోధకులు కనిపెట్టారు. రిస్క్ ఎక్కువగా ఉండడంతోనే అందరూ అనుమానిస్తున్న చైనాలో చేయడం కంటే పాకిస్తాన్ లో చేయడం బెటర్ అని ఇక్కడికి చైనా మార్చినట్టు సమాచారం.
ఇలా పొరుగున ఉన్న భారత్ సహా ప్రపంచదేశాలకు ఈ కొత్త వైరస్ పెనుముప్పుగా పత్రిక కథనాలు వెలువరించింది. ఈ వినాశకర ప్రాజెక్టును కరోనాను అంటించిన చైనాలో చేయకుండా డౌట్ రాకుండా పాకిస్తాన్ లో చేస్తున్నట్టు.. అందుకే ఇక్కడికి తరలించినట్టు పత్రిక కథనంలో పేర్కొంది.
ఖచ్చితంగా ‘సీసీహెచ్.ఎఫ్.వీ’ వైరస్ బయో వెపన్ గానే చైనా తయారు చేస్తున్నట్టు అనుమానాలు బలపడుతున్నాయి. దీనికి పాకిస్తాన్ సహకరించడం.. తయారీని తన దేశంలో రహస్యంగా చేస్తున్నారని పత్రిక పేర్కొంది.
అయితే క్లాక్సన్ పత్రిక కథనాన్ని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఖండించింది.
ఈ క్రమంలోనే అభాసుపాలవుతున్న చైనా ఇప్పుడు తన చేతికి మట్టి అంటకుండా మిత్రదేశం పాకిస్తాన్ లో ఓ కొత్త బయో వెపన్ తయారు చేయడానికి పూనుకుందనే అనుమానాలను తాజాగా ఆస్ట్రేలియా పత్రిక ‘ద క్లాకన్’ వ్యక్తం చేసింది. ఈ పరిశోధక పత్రిక తాజాగా ఆంథ్రాక్స్ తరహా అత్యంత ప్రమాదకర వైరస్ లు.. బ్యాక్టీరియాల అభివృద్ధికి చైనా-పాకిస్తాన్ కలిసి రహస్య ప్రాజెక్టును నడుపుతున్నాయని సంచలన కథనాన్ని ప్రచురించింది.
చైనా తన మిత్ర దేశం పాకిస్తాన్ తో కలిసి ఈ కొత్త బయోవెపన్ ను భారత సరిహద్దుల్లోని పాకిస్తాన్ లో గల రావల్పిండిలో ఉన్న ‘డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్’ ల్యాబ్ లో తయారీకి పరిశోధనలు చేస్తున్నారని పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. దీనికి సంబంధించి పాకిస్తాన్ సైన్యానికి చెందిన గల రావల్పిండిలో ఉన్న ‘డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్’తో చైనా ఒప్పంద చేసుకున్నట్టు పత్రిక తెలిపింది.
విశేషం ఏంటంటే ఈ భారీ బయో వెపన్ ఖర్చు అంతా చైనాదేనట.. కానీ చైనా భూభాగంలో చేయకుండా పాకిస్తాన్ లో ప్రయోగాలు చేస్తుందని పత్రిక తెలిపింది. ఇందులో పాకిస్తాన్ ఆరోగ్యశాఖకు.. పాకిస్తాన్ యూనివర్సిటీలకు పాత్ర లేకుండా మొత్తం స్వయం ప్రతిపత్తి గల రావల్పిండి ‘డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్’కు అప్పగించడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొంది. ఇందులో మొత్తం చైనీస్ పరిశోధకులే తతంగం నడిపిస్తున్నారని తేలింది.
ఆంత్రాక్స్ జాతికి చెందిన ‘సీసీహెచ్.ఎఫ్.వీ’ అనే వైరల్ ఫీవర్ పై పాకిస్తాన్ లో చైనా సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. ఈ వైరల్ ఫీవర్ తో 25శాతం మంది ప్రపంచవ్యాప్తంగా మరణించే అవకాశం ఉందని సమాచారం.. అంతటి భయంకరమైన వైరల్ రకం జ్వరం వచ్చిన వ్యక్తులు కోలుకోవడం చాలా కష్టం అని చైనా పరిశోధకులు కనిపెట్టారు. రిస్క్ ఎక్కువగా ఉండడంతోనే అందరూ అనుమానిస్తున్న చైనాలో చేయడం కంటే పాకిస్తాన్ లో చేయడం బెటర్ అని ఇక్కడికి చైనా మార్చినట్టు సమాచారం.
ఇలా పొరుగున ఉన్న భారత్ సహా ప్రపంచదేశాలకు ఈ కొత్త వైరస్ పెనుముప్పుగా పత్రిక కథనాలు వెలువరించింది. ఈ వినాశకర ప్రాజెక్టును కరోనాను అంటించిన చైనాలో చేయకుండా డౌట్ రాకుండా పాకిస్తాన్ లో చేస్తున్నట్టు.. అందుకే ఇక్కడికి తరలించినట్టు పత్రిక కథనంలో పేర్కొంది.
ఖచ్చితంగా ‘సీసీహెచ్.ఎఫ్.వీ’ వైరస్ బయో వెపన్ గానే చైనా తయారు చేస్తున్నట్టు అనుమానాలు బలపడుతున్నాయి. దీనికి పాకిస్తాన్ సహకరించడం.. తయారీని తన దేశంలో రహస్యంగా చేస్తున్నారని పత్రిక పేర్కొంది.
అయితే క్లాక్సన్ పత్రిక కథనాన్ని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఖండించింది.