చివరికి బెడ్​ రూంలోనూ అది మా వెంటే.. ఐపీఎల్​ పై అశ్విన్

Update: 2020-09-05 11:30 GMT
కరోనా కష్టాలు ఐపీఎల్​ ఆడగాళ్లను తాకాయి. ఉందో లేదో అనుకున్న ఐపీఎల్​ చివరకు ఫిక్స్​ అయ్యింది. అయితే ఇప్పుడీ ఐపీఎల్​ కారణంగా ఆటగాళ్లకు కొత్త చిక్కు వచ్చి పడిందట. అదేంటంటే.. కరోనా నుంచి ఆటగాళ్లను రక్షించేందుకు ఆయా జట్ల యాజమాన్యాలు  ప్రతి ఐపీఎల్​ ప్లేయర్​కు జియో ట్యాగింగ్ పరికరాన్ని అమర్చారు. ఆటగాళ్లు వేరే వ్యక్తులకు సమీపంలోకి వెళ్లారంటే అలారం మోగుతుంది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై వీళ్లను అలర్ట్​ చేస్తారు. తాజాగా ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్​కు చెందిన సీనియర్​ స్పిన్నర్​ రవిచంద్రన్​ తన యూ ట్యూట్​ చానల్​ ద్వారా పంచుకున్నాడు. ఇంతకీ అతడు ఏమంటున్నాడంటే..

 ‘ఐపీఎల్​ 2020 కోసం మేమంతా ప్రస్తుతం దుబాయ్ లో  క్వారంటైన్​ ముగించుకొని  ప్రాక్టీస్​ చేస్తున్నాం. మేము గది దాటామంటే జియో ట్యాగింగ్ పరికరం మా దగ్గర ఉండాల్సిందే. మేము వేరే ఆటగాళ్ల దగ్గరగా వెళ్లగానే అది మమ్మల్ని అలర్ట్ చేస్తోంది. వెంటనే ఆ పరికరం నుంచి ఓ గంట మోగుతుంది. ఇక్కడ మమ్మల్ని అధికారులు కఠిన నిబంధనల మధ్య మమ్మల్ని ఉంచుతున్నారు. అంతకుముందు మాకు దీనిని ఎలా వినియోగించాలి అనే దాని గురించి జూమ్‌ కాల్‌లో వివరించారు. అప్పుడు ఓ ఆటగాడు ఓ ప్రశ్న అడిగాడు. అక్కడ బయోబుల్ లోకి వచ్చిన మా భార్యలు కూడా ఈ పరికరం వాడాల్సిందేనా.. అని ప్రశ్నించాడు. దానికి అవును అని అధికారులు తెలిపారు. మరి ఆటగాళ్ళం  మా భార్యలతో గదిలో కలిసే ఉంటాము కదా! అప్పుడు కూడా ఈ గంట మోగుతుందా అని అన్నాడు. దానికి అందరం నవ్వుకున్నాం.. అంటూ అక్కడి విశేషాలు చెప్పుకొచ్చాడు రవిచంద్రన్​.
Tags:    

Similar News