మంత్రి కొల్లుకు తప్పిన ముప్పు

Update: 2016-05-06 04:45 GMT
ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు భారీ ప్రమాదానికి గురైంది. కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవటంతో మంత్రి కొల్లు గాయాలతో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఏపీ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత గుంటూరు నుంచి విజయవాడకు వెళుతున్నారు.

ఆయన ప్రయాణిస్తున్న కారు మంగళగిరి మండలం టోల్ ప్లాజా వద్ద అదుపు తప్పి పల్టీలు కొట్టింది.  కారు వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో  కారు ప్రమాదానికి గురి కావటం.. అదృష్టవశాత్తు కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవటంతో మంత్రికి స్వల్ప గాయాలతో బయటపడినట్లు చెబుతున్నారు. ఆయన వెంట ఉన్న నలుగురికి గాయాలు అయినట్లుగా చెబుతున్నారు.

ప్రస్తుతం వారిని తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ఆయనకు ఎలాంటి అపాయం లేదని.. ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవటంతో పెను ముప్పు తప్పిందని చెబుతున్నారు. ప్రమాదం ఎందుకు జరిగింది? ఎలా జరిగిందన్న అంశానికి సంబంధించి వివరాలు బయటకు రావాల్సి ఉంది.
Tags:    

Similar News