కృష్ణా బోర్డుకు ఏపీ సర్కార్ లేఖ
కృష్ణా నదీ జలవివాదాలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమసిపోవడం లేదు. శ్రీశైలం నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తుండగా.. తెలంగాణ సర్కార్ అభ్యంతరం తెలుపుతోంది. ఇప్పటికీ కృష్ణా జలాల వాటాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది.
ఈ క్రమంలోనే కృష్ణా నది జలాల్లో వాటాపై ఏపీ గొంతెత్తింది. వాటాల ప్రకారం కృష్ణా జలాల్లో మరో 77 టీఎంసీలు ఇవ్వాలంటూ తాజాగా కృష్ణా బోర్డుకు ఏపీ సర్కార్ లేఖ రాసింది.
పోతిరెడ్డిపాడు నుంచి 66 టీఎంసీలు, హంద్రీనీవాకు 5 టీఎంసీలు కేటాయించాలని బోర్డును కోరింది. ఆగస్ట్ , సెప్టెంబర్ నెలలకు ఈ నీటిని ఇవ్వాలని బోర్డును ఏపీ ప్రభుత్వం కోరింది.
గతంలో పోతిరెడ్డిపాడు నుంచి 9 టీఎంసీలు, హంద్రీనీవాకు 8 టీఎంసీలు బోర్డు కేటాయించింది. ఇప్పుడు వీటికి అదనంగా 71 టీఎంసీలు ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది.
ఈ క్రమంలోనే కృష్ణా నది జలాల్లో వాటాపై ఏపీ గొంతెత్తింది. వాటాల ప్రకారం కృష్ణా జలాల్లో మరో 77 టీఎంసీలు ఇవ్వాలంటూ తాజాగా కృష్ణా బోర్డుకు ఏపీ సర్కార్ లేఖ రాసింది.
పోతిరెడ్డిపాడు నుంచి 66 టీఎంసీలు, హంద్రీనీవాకు 5 టీఎంసీలు కేటాయించాలని బోర్డును కోరింది. ఆగస్ట్ , సెప్టెంబర్ నెలలకు ఈ నీటిని ఇవ్వాలని బోర్డును ఏపీ ప్రభుత్వం కోరింది.
గతంలో పోతిరెడ్డిపాడు నుంచి 9 టీఎంసీలు, హంద్రీనీవాకు 8 టీఎంసీలు బోర్డు కేటాయించింది. ఇప్పుడు వీటికి అదనంగా 71 టీఎంసీలు ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది.