లోకేశ్ ఓపెన్ సీక్రెట్లు విప్పేసిన టీడీపీ నేత

Update: 2017-01-21 07:15 GMT
ఏపీ ప్రభుత్వంలో ఏ పదవీ లేకున్నా సీఎం కుమారుడి హోదాలో లోకేశ్ రాజ్యాంగేతర శక్తిగా మారారన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ పార్టీ ప్రజాప్రతినిధులే డైరెక్టుగా ఆ విషయం చెప్పేస్తున్నారు. నారా లోకేష్ కనుసన్నల్లోనే ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోందన్న ఆరోపణలకు బలం చేకూర్చేలా అనంతపురం జడ్పీ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలు విపక్షాల చేతికి ఆయుధంగా మారాయి.
    
కాంట్రాక్టుల నుంచి అధికారుల బదిలీలు, నిధుల మంజూరు వరకు అంతా లోకేష్ చెప్పినట్టే జరుగుతోందని అతను ఒక రాజ్యాంగేతర శక్తిగా మారారని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. టీడీపీ నేతలు కూడా ఈ విషయాన్ని అప్పుడప్పుడు బహిరంగంగానే ఒప్పుకుంటున్నారు. తాజాగా అనంతపురం జెడ్పీ చైర్మన్ చమన్ కూడా లోకేష్ రాజ్యాంగేతర శక్తిగానే పనిచేస్తున్నారని పరోక్షంగా చెప్పారు. జెడ్పీ సమావేశంలో నిధుల గురించి పలువురు సభ్యులు ప్రశ్నించగా… నారా లోకేష్‌ తో చర్చిస్తున్నామని ఆయన నిర్మొహమాటంగా చెప్పారు.
    
దీంతో... నిధుల మంజూరు కోసం నారా లోకేష్ తో చర్చిస్తున్నామని చమన్ అనడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ప్రభుత్వ నిధుల గురించి ఏ పదవిలో లేని లోకేష్‌ తో చర్చించడం ఏమిటని ఆశ్చర్యపోయారు.  కాగా.. చమన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు కూడా మండిపడుతున్నారట. జడ్పీ సమావేశంలో అలాంటి ఓపెన్ సీక్రెట్లు చెప్పేస్తే ఎలా అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News