ఆనంద్ మహీంద్రా మండే మోటివేషన్.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. !

Update: 2022-11-28 23:30 GMT
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారనే సంగతి అందరికీ తెల్సిందే. ఎవరైనా కొత్త పరికరాలను కనుగొన్నప్పుడు వారిని సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తుంటారు. బిజినెస్ ఐడియాలు.. సామాజిక పరమైన అంశాలతోపాటు తనకు మంచిది అనిపించిన ప్రతీ అంశాన్ని తన ఫాలోవర్స్ కు ఆనంద్ మహేంద్ర తెలియజేస్తుంటారు.

నెటిజన్లను మోటీవేట్ చేసేలా తరుచూ మంచి మంచి కోట్స్ ను తన ట్వీట్టర్ హ్యాండిల్ లో షేర్ చేస్తుంటారు. వీటిని చూసిన ఫాలోవర్స్ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తూ వైరల్ చేస్తుండటం కామన్ అయింది. ఇక నేడు మండే మోటీవేషన్ పేరుతో ఆనంద్ మహీంద్రా ఒక ట్వీట్ ను పోస్టు చేసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

‘‘మనమంతా పిచ్చివాళ్లమని గ్రహించిన క్షణం మాత్రమే.. జీవితం పూర్తిగా అర్థమవుతుంది.." అనే ‘మార్క్ ట్వైన్‌’ కొటేషన్ ని ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్లో షేర్ చేశారు. దీనికి ‘‘ప్రపంచం ఒక పిచ్చినివాసం అని.. మనమందరం కొంచెం వెర్రివాళ్లమని.. మీలో మీరు అంగీకరిస్తే.. మీ ముఖంపై చిరునవ్వుతో.. సోమవారాల్లో మీరు పనికి వెళ్లవచ్చు.. మీరు చేసే పనిలో మీరు ‘‘వెర్రి మంచి’’గా ఉండటానికి ప్రయత్నిస్తున్నారని నిర్ధారించుకోండి..!" అంటూ క్యాష్షన్ ఇచ్చాడు.

ఆనంద్ మహేంద్ర పోస్ట్ చేసిన ఈ ట్విట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీనిపై నెటిజన్లు సైతం తమ సృజానత్మకతను జోడించి కామెంట్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆనంద్ మహేంద్రా మండే మోటివేషన్ కోటేషన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై మీ రియాక్షన్ ఏంటో కింద మాతో పంచుకోండి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News