అమెరికాలో గంటల ముందు ఉరి శిక్ష రద్దు ....!

Update: 2021-01-13 04:37 GMT
దాదాపు డెబ్బై ఏళ్ల తర్వాత అమెరికా తొలిసారి ఒక మహిళకు మరణశిక్ష అమలు చేయబోయి , చివరి క్షణంలో రద్దు చేశారు. ఆ మహిళ.. లీసా మాంట్‌గోమెరి. ఒక నిండు గర్భిణిని హత్య చేసినందుకు ఆమెకు పడిన ఈ శిక్షను రద్దు చేయాలని మరణ దండనను వ్యతిరేకించే మానవతావాదులు కొత్త అధ్యక్షుడు జోబైడన్‌ కు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి ముందే లీసా శిక్ష అమలవకుండా ఉండే అవకాశం లేదు అని అనుకున్న సమయంలో 24 గంటల ముందు ఉరి శిక్ష ను నిలిపివేసింది. లీసాకు మానసిక స్థితి బాగోలేకలేదు అంటూ కోర్టుకి తెలియజేయడంతో కోర్టు ఉరి శిక్షను రద్దు చేశారు.

ఒక స్త్రీ జీవితంలో జరగకూడదనిదే లీసా జీవితంలో జరిగింది. అది.. లీసా చేసిన హత్య కన్నా కూడా ఘోరమైనది, మూడేళ్ల వయసులో తన పక్కన పడుకుని ఉన్న ఎనిమిదేళ్ల తన ప్రియమైన అక్కపై  ఆమె సంరక్షకుడు  పలుమార్లు అత్యాచారం జరపడం చూసింది లీసా. అలా చాలాకాలం పాటు చూస్తూనే ఉంది. ఆ తర్వాత లీసానే తన పదకొండో ఏట నుంచి మారుతండ్రి అత్యాచారానికి గురవడం మొదలైంది.ఆ చిరుప్రాయపు లైంగిక హింస, తల్లి కూడా చూసీచూడనట్లు ఉండిపోవడం, మారు తండ్రి అతడి స్నేహితులను తనపైకి ఉసిగొల్పడం.. అవన్నీ ఆమె బాల్యాన్ని, యవ్వనాన్ని హరించాయి. ఆమె మతిస్థిమితం కూడా తప్పింది. కెవిన్‌ అనే అతన్ని పెళ్లి చేసుకుంది కానీ, ఆమెతో పాటు పెరిగి పెద్దదైన చిన్ననాటి భయానక మనోస్థితిని ఆమె దాంపత్య జీవితం ఏమాత్రం మార్చలేకపోయింది. కొన్నిసార్లు కెవిన్‌ కూడా ఆమె భయం చూసి విసుక్కునేవాడు. పాత జీవితాన్ని ఎందుకు మర్చిపోవు అని అడిగేవాడు. ఆమె దగ్గర సమాధానం లేదు. లైంగిక హింస, దాడి వల్ల లీసా బ్రెయిన్‌ కూడా దెబ్బతినిందని వైద్యులు గుర్తించారు కూడా.

లీసా యు.ఎస్‌.లోని కన్సాస్‌ లో పుట్టింది. ప్రస్తుతం ఆమె వయసు 52 ఏళ్లు. గర్భిణిని హత్య చేసేటప్పటికి 36 ఏళ్లు. ఆమె చంపింది బాబీ జో స్టిన్నెట్‌ అనే 23 ఏళ్ల నిండు గర్భిణిని. స్టిన్నెట్‌ ఉండేది మిస్సోరీలో. లీసా ఉండేది కన్సాస్‌లో. మరి ఈ హత్య ఎలా జరిగింది, 2004 డిసెంబర్‌ 16. స్టిన్నెట్‌ తన గదిలో రక్తపు మడుగులో పడి ఉండటాన్ని మొదట చూసింది స్టిన్నెట్‌ తల్లి బెక్కీ హర్పర్‌. స్టిన్నెట్‌ కడుపు కోసి, బిడ్డను అపహరించుకెళ్లారెవరో, బెక్కీ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇరవై నాలుగ్గంటల లోపే దోషి పట్టుబడింది. లీసా మాంట్‌గోమరీ, స్టిన్నెట్‌ మెయిల్స్ ‌ని తెరిచి చూసిన పోలీసులకు లీసాకు, స్టిన్నెట్‌ కు మధ్య ఉన్న స్నేహం గురించి తెలిసింది. వాళ్లిద్దరి చాటింగ్‌ ని బట్టి ఇద్దరికీ కుక్కపిల్లల్ని పెంచడంలో ఆసక్తి ఉందని, వాటి ఫుడ్‌ గురించి ప్రత్యక్షంగా మాట్లాడుకోడానికి డిసెంబర్‌ పదహారున లీసా మిస్సోరీ వెళ్లి ఆమెను కలిసినప్పుడు ఈ హత్య జరిగిందనీ నిర్థారణ అయింది. లీసా నేరం ఒప్పుకుంది కానీ, తెలిసీ ఆ నేరాన్ని చేయలేదంది. అయితే స్టిన్నెట్‌ కడుపులోని బిడ్డను అపహరించుకుని వెళ్లడాన్ని బట్టి చూస్తే మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఆమె ఆ హత్య చేసినట్లు స్పష్టం అవుతోంది. బిడ్డను స్టిన్నెట్‌ భర్తకు అప్పగించి, అదే రోజు లీసాను అరెస్ట్‌ చేశారు. పద్నాలుగేళ్లుగా కేసు నడిచి మొన్నటికి తీర్పువచ్చింది. అయితే , ఆ తీర్పుని కోర్టు తాజాగా రద్దు చేశారు.
Tags:    

Similar News