అదే సూపర్ పవర్...వైసీపీకి తత్వం బోధపడుతోందా ?
రోజులు మారాయి. అంతా ఇపుడు సోషల్ మీడియా యుగం. ఎవరేమిటి అన్నది అందరికీ తెలుస్తుంది.;
రోజులు మారాయి. అంతా ఇపుడు సోషల్ మీడియా యుగం. ఎవరేమిటి అన్నది అందరికీ తెలుస్తుంది. అయినా తెల్లారి లేస్తే మళ్లీ కొత్తగా పరిచయం చేసుకోవాలి. ఎందుకంటే ఎవరి మైండ్ లో ఏదీ ఎంతగా రిజిస్టర్ అవుతోంది అర్ధం కాని నేపథ్యం ఉంది. ఇదిలా ఉంటే రాజకీయాలకు సినిమాలకు పబ్లిసిటీ ఉండాలి. లేకపోతే కష్టం. ప్రచారం పీక్స్ పెర్ఫార్మెన్స్ వీక్ అని చాలా ఈజీగా కామెంట్స్ చేయవచ్చు. కానీ ఇది భారతదేశం. వెస్టర్న్ కంట్రీస్ మాదిరిగా బిగ్ డిబేట్స్ కొన్ని చేసి జనాలు ఓట్లు వేస్తారనుకుంటే పొరపాటు అంటున్నారు.
ఫెయిల్ అయింది అక్కడేనా :
వర్తమాన రాజకీయాల్లో చేసింది ఎంత అన్నది పక్కన పెడితే ఆ చేసింది ఒకటికి వంద సార్లు చెప్పుకోవాల్సిన అగత్యం అయితే ఉంది. ఎందుకంటే జనాలకు షార్ట్ మెమరీ. పైగా ఈ రోజు అంతా ఓపెన్ అయిపోయింది. వారికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఒకే వైపు చూస్తూ కూర్చోరు. అలా వారు తమ వైపే ఉండాలి అనుకుంటే కనుక ఎన్నో విద్యలు విన్యాసాలు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది వైసీపీ అయితే ప్రచారం విషయంలో వీక్ అన్నది అందరికీ తెలిసిందే. అంతవరకూ ఎందుకు జగన్ అయిదేళ్ల పాలనలో ఏకంగా రెండు వందల డెబ్బై నాలుగు లక్షల కోట్ల రూపాయలను నేరుగా నగదు బదిలీ పధకం కింద జనాల ఖాతాలో వేశారు. ఇదంతా ఆయన తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో కూర్చుని ఒక బటన్ నొక్కి మమ అనిపించేశారు ఆ వెంటనే ప్రతీ లబ్దిదారుడు ఫోన్ నుంచి క్లిక్ మని సౌండ్ వచ్చి సొమ్ము జమ అయిపోయింది. వారు దానిని హాయిగా తీసుకున్నారు ఇందులో మధ్య దళారీ ఎవరూ లేరు, ఎక్కే గుమ్మం దిగే గుమ్మం సమస్య అయితే లేదు. కానీ ఎవరు ఇచ్చారు అన్నది కూడా ఆఖరుకు జనాలకు అవసరం లేకపోయింది.
చెప్పుకోవాల్సిందే :
చేసింది చెప్పుకుంటే తప్పు ఏమిటి అన్నది రాజకీయ వర్గాలలో ఉంది. ఆ మాటకు వస్తే వైసీపీలో ఉంది. కానీ జగన్ మాత్రం ప్రచారానికి దూరంగా ఉంటారు అని చెబుతారు. తాము చేసిన మంచి జనాల మనసుల్లో ఉంటుంది అదే గెలిపిస్తుంది అని నమ్మకం ఉంది ఆయన 2024 ఎన్నికలను ఫేస్ చేశారు. అయితే రిజల్ట్ దారుణంగా వచ్చింది. దాంతో పబ్లిసిటీ వాల్యూ ఏమిటీ ఏణ్ణర్థం కూటమి పాలన స్పష్టంగా తెలియచేస్తోంది అని అంటున్నారు.
బాబు జోరు ముందు :
తాజాగా మొంథా తుఫాన్ విషయమే తీసుకుంటే చంద్రబాబు సచివాలయంలో నిరంతరం ఉంటూ అధికారులను మోనిటరింగ్ చేశారు ఆ మీదట క్షణం ఆలస్యం చేయకుండా ఏరియల్ సర్వే చేశారు. బాధితుల వద్దకు వెళ్ళి పరామర్శించారు ఇవన్నీ ఆయన ఒక పద్ధతి ప్రకారం చేశారు. దాంతో బాబు చేసినది ఏమిటి అన్నది జనాలకు తెలిసి వచ్చింది. అదే జగన్ టైం లో కూడా తుఫాన్లు ప్రకృతి విపత్తులు వచ్చాయి. జగన్ కూడా అధికారులతో మీటింగులు పెట్టేవారు. ఆ మీదట వారికి బాధ్యతలు ఇచ్చేవారు అయితే ఇదంతా ఎక్కడా పెద్దగా పబ్లిసిటీకి నోచుకోలేదు అది వద్దు అనే అనుకున్నారు. రోటీన్ గా చేసే దానికి ప్రచారం ఎందుకు అన్నది గత పాలకుల వైఖరి. కానీ అదే జనాలకు కావాల్సింది అదే నయా ట్రెండ్ పాలిటిక్స్ అన్నది వైసీపీ పెద్దలకు ఇపుడు తెలిసి వస్తోందిట.
పధకాల విషయంలో :
పధకాల విషయంలో కూడా ప్రతీ నెలా చంద్రబాబు ఒక పేద ఇంటికి వెళ్ళి ముచ్చట్లు పెట్టి మరీ పెన్షన్లు ఇస్తున్నారు. అలా ఆయన ఏణ్ణర్ధంగా చేస్తున్నారు. అంతే కాదు ఏ పథకం ఇచ్చినా లేక ఏ కార్యక్రమం చేపట్టినా జనంలోనే ఉంటున్నారు. వారి మధ్యనే చేస్తున్నారు. బాబు చేస్తున్నది అతి అని పబ్లిసిటీ పీక్స్ అని విమర్శించడం వరకూ ఓకే అయినా వైసీపీ మరీ వీక్ గా ఉంటే ఎలా అన్న చర్చ అయితే సాగుతోంది. ఈ విషయంలో వైసీపీ తన తీరు మార్చుకోవాల్సిందే అని అంటున్నారు. తాము ఏమి చేశామన్నది నిత్యం జనంలో చర్చ పెట్టాలని అలాగే మళ్ళీ వస్తే ఏమి చేస్తామన్నది కూడా వారికి సోదాహరణంగా వివరినాలని అంటున్నారు. మరి వైసీపీ అధినాయకత్వానికి లోటు లోపాలు ఏమిటో తెలిసి వచ్చాయని అమలు చేయడం ఎలా అన్నదే ఆలోచించాలని అంటున్నారు.