అయితే పార్లమెంట్...లేదా జనంలోనే
ఎంపీలు అంటే వారి పరిధి పెద్దది, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. అయితే ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఉంటారు.;
ఎంపీలు అంటే వారి పరిధి పెద్దది, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. అయితే ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఉంటారు. దాంతో ఎంపీలు అనేక పార్టీలలో చూస్తే కనుక ఢిల్లీలో ఎక్కువ కాలం గడుపుతారు అన్న ప్రచారం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం ఎంపీలకు కీలక సూచనలు చేస్తోంది. అయితే పార్లమెంట్ సమావేశాలలో ఉండాలని, అవి అయిపోయిన తర్వాత జనంలోనే ఉండాలని కోరింది. దీని మీద అధినేత చంద్రబాబు అయితే ఎంపీలకు చేయాల్సిన సూచనలు చేశారు.
మెడికల్ కాలేజీల మీద :
విపక్ష వైసీపీ ఏపీలో ప్రైవేట్ లోకి మెడికల్ కాలేజీలు అని ప్రచారం చేస్తోంది అని బాబు ఎంపీల దృష్టికి తెచ్చారు. కానీ అందులో వాస్తవం లేదని ఆయన అన్నారు. పీపీపీ మోడల్లో తీసుకొస్తున్న మెడికల్ కాలేజీలు పూర్తిగా ప్రభుత్వ ఆస్తులేనని బాబు స్పష్టం చేశారు వీటిలో 70 శాతం సేవలు ఉచితమని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని ఆయన ఎంపీలను కోరారు, విపక్షం చేసే ప్రచారాన్ని తిప్పికొడుతూ ఎంపీలు జనలోకి వెళ్ళి ఇవన్నీ వివరించాలని ఆయన సూచించారు. ఇక ప్రతి పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్ విద్యార్థుల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించే కార్యక్రమాలపై ఎంపీల సహకారం అవసరమని అందువల్ల వారు పూర్తిగా వీటికి సహకరించాలని కోరారు.
ప్రజల కోసమే :
టీడీపీ ఎంపీలు ఇక మీదట పూర్తిగా ప్రజల మధ్య ఎంపీలు ఉండాలని బాబు కోరారు. ప్రతీ ఎంపీ పార్లమెంటులో చురుగ్గా ఉండటంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలను ప్రస్తావించాలని కోరారు. అదే విధంగా పార్లమెంట్ అయిపోగానే తమ నియోజకవర్గాల్లో పేదల కోసం జరుగుతున్న పేదల సేవలో వంటి కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. టీడీపీలో ఉన్న యువ పార్లమెంటేరియన్లు ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలను తెలియచేస్తూ తాము ఉన్నామన్న నమ్మకం కలిగించాలని సూచించారు. ప్రజా సేవే ఎంపీలు తప్పనిసరిగా అనుసరించాల్సిన మార్గమని చెప్పారు.
క్రియాశీలకంగా :
ఎంపీలు పార్టీ కార్యక్రమాలలో కూడా గతానికి కంటే ఎక్కువగా ఇక మీదట పాల్గొనాలని బాబు చెప్పారు అలాగే పార్టీ కార్యక్రమాల్లో ఎంపీలు క్రియాశీలకంగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియచెప్పాల్సిన బాధ్యత ఎంపీల మీద ఉందని ఆయన అన్నారు. ఎంపీలు ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉండాలని సూచించారు. గత పాలకుల విధ్వంసం కారణంగా ఏపీకి మరి కొంత కాలం ఇబ్బందులు తప్పవని ఈ విషయాలను ప్రజలకు వివరిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడుపుతున్న వైనాన్ని తెలియచేయాలని బాబు కోరారు.
వాటి జోలికి వెళ్ళొద్దు :
ఎంపీలు అంతా రాజకీయంగా తమ నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించాలని చంద్రబాబు సూచించారు. అనవసరపు వివాదాల జోలికి వెళ్లకుండా చూసుకోవాలని ఆయన హెచ్చరించారు వివాదాలతో ఎంపీలకు వ్యక్తిగతంగానూ అలాగే పార్టీకి కూడా నష్టం కలుగుతుందని బాబు తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీల పనితీరు మీద ప్రతీ వారం వేర్వేరు మార్గాల ద్వారా సమాచారం తెప్పించుకుని బేరీజు వేస్తున్నామని ఈ విషయం అంతా గురించి తమ విధులను సక్రమంగా నెరవేర్చాలని కోరారు.