'పుట్టగానే జగన్ గొంతునులిమి చంపేసుంటే పీడ పోయేది'.. రేణుకా దారుణ కామెంట్స్

ఓ న్యూస్ చానెల్ లో మంగళవారం జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై చర్చ సాగుతోంది. ఈ చర్చలో ఫోన్ ఇన్ ద్వారా పాల్గొన్న రేణుకా చౌదరి, ఈ ఘటనపై స్పందిస్తూ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు.;

Update: 2025-06-10 04:49 GMT
పుట్టగానే జగన్ గొంతునులిమి చంపేసుంటే పీడ పోయేది.. రేణుకా దారుణ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఓ న్యూస్ చానెల్ చర్చలో అమరావతి రాజధానిపై ప్యానలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు, వాటిని అడ్డుకోలేదన్న కారణంతో జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరచిపోకముందే.. అలాంటిదే మరో దుర్ఘటన చోటుచేసుకుంది. ఈసారి మరో న్యూస్ ఛానల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అత్యంత అనుచిత వ్యాఖ్యలు చేశారు.

ఓ న్యూస్ చానెల్ లో మంగళవారం జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై చర్చ సాగుతోంది. ఈ చర్చలో ఫోన్ ఇన్ ద్వారా పాల్గొన్న రేణుకా చౌదరి, ఈ ఘటనపై స్పందిస్తూ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిపై వ్యాఖ్యల వివాదంలో కనీసం ముందుకొచ్చి సాహసం చేయని "వెధవ" అంటూ జగన్‌పై బూతులతో రెచ్చిపోయారు.

అంతేకాకుండా రేణుకా చౌదరి తన వ్యాఖ్యల పరంపరలో హద్దులు మీరి "జగన్ పుట్టినప్పుడే విజయమ్మ ఆయన గొంతు నులిమి చంపేస్తే పీడా పోయేది" అంటూ అత్యంత దారుణ వ్యాఖ్యలు చేశారు. రేణుకా చౌదరి చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలపై సదురు చర్చలో పాల్గొన్న జర్నలిస్ట్ ఆమెను వారించే ప్రయత్నం చేశారు. ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ రేణుకకు హితవు పలికారు. అయినప్పటికీ రేణుకా చౌదరి వ్యాఖ్యలు రాజకీయంగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

ప్రజా జీవితంలో ఉన్నవారు, ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులు, ప్రజా వేదికల్లో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని, వ్యక్తిగత దూషణలకు దిగడం సభ్య సమాజానికి మంచిది కాదని పలువురు హితవు పలుకుతున్నారు. ఈ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తూ సోషల్ మీడియాలో ఆ వీడియోను షేర్ చేస్తూ ప్రశ్నిస్తోంది. 

Tags:    

Similar News