బాత్రూంలో ఎంబీఏ విద్యార్థిని ప్రసవం.. తర్వాత జరిగింది తెలిస్తే కన్నీళ్లే

కాలం గడుస్తున్న కొద్దీ మనిషి మరీ కర్కశంగా తయారవుతున్నాడా? భావోద్వేగాలు లేని పరికరంగా మారుతున్నాడా?

Update: 2024-05-04 04:42 GMT

కాలం గడుస్తున్న కొద్దీ మనిషి మరీ కర్కశంగా తయారవుతున్నాడా? భావోద్వేగాలు లేని పరికరంగా మారుతున్నాడా? సహజ సిద్ధంగా ఉండే మనిషి లక్షణాలు ఎందుకు మిస్ అవుతున్నాయన్న భావన కలుగుతుందీ ఉదంతం గురించి తెలిస్తే. ఇష్టం ఉందో.. లేదో తెలీదు.


ఎలాంటి పరిస్థితుల్లో సదరు అమ్మాయి గర్భం దాల్చిందో తెలీదు. తొమ్మిది నెలలు మోసిన పసిగుడ్డు భూమి మీద పడినంతనే.. అత్యంత కర్కశత్వంతో వ్యవహరించిన తీరు తెలిస్తే ఒళ్లు జలదరించటమే కాదు.. మనసంతా చేదుగా మారిపోతుంది. ఇదంతా చేసిన అమ్మాయి మానసిక పరిస్థితి బాగోలేదనుకున్నా పొరపాటే.

ఉన్నత విద్యను అభ్యసిస్తూ.. గర్భం దాల్చిన ఆ అమ్మాయి వ్యవహరించిన తీరు సభ్య సమాజానికి.. నాగరికతకు మాయని మచ్చగా మారుతుందని చెప్పాలి. కేరళలోని కొచ్చిన్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం సంచలనంగా మారటమే కాదు.. మనసున్న పలువురు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని గర్భం దాల్చింది. శుక్రవారం ఉదయం ఆమె బాత్రూంలో ఉండగా శిశువునకు జన్మనిచ్చింది.

ఇంట్లోని వారికి తెలీకుండా గర్భం దాల్చిన ఆమె.. డెలివరీ విషయం తల్లిదండ్రులకు తెలీకూడదని.. అమెజాన్ పార్సిల్ కవర్ లో పసిగుడ్డును చుట్టి అపార్ట్ మెంట్ బాల్కనీ నుంచి బయటకు విసిరేసింది. పై నుంచి కింద రోడ్డు మీద పడినంతనే సదరు శిశువు ప్రాణాలు కోల్పోయింది.

కొందరు కార్మికులు పెద్ద కవరులో ఉన్న శిశువును చూసి షాక్ తిని.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పార్సిల్ కవర్ మీద ఉన్న అడ్రస్ సాయంతో నిందితురాలిని గుర్తించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఎంత కసాయి అయితే మాత్రం.. పుట్టిన బిడ్డను పొత్తిళ్లలోనే చంపేయటమా?అంటూ విస్మయానికి గురవుతున్నారు.

Tags:    

Similar News