సీఎం రేవంత్ ఓఎస్డీ మాట్లాడుతున్నా.. అంటూ మాజీ క్రికెటర్ మోసాలు!

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా నర్సన్సపేట.. లక్ష్మీనగర్ లో నివసించే 32 ఏళ్ల బొడుమూరు నాగరాజు మాజీ క్రికెటర్.;

Update: 2025-05-23 04:03 GMT
సీఎం రేవంత్ ఓఎస్డీ మాట్లాడుతున్నా.. అంటూ మాజీ క్రికెటర్ మోసాలు!

వీడు మామూలు ముదురు కాదు. దేశ ముదురుకు మించినోడు. ఏపీకి చెందిన మాజీ క్రికెటర్ తీరు తెలిసినోళ్లు నోరెళ్లబెడుతున్నారు. తాను చేసే మోసాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే వాడేసుకోవటం ఇతగాడి తెంపరతానికి నిదర్శనం. తాను సీఎం రేవంత్ ఓఎస్డీ అంటూ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) పరిచయం చేసుకొని ప్రముఖల నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ ముదురు కేసు చేసిన మోసాల తీరులోకి వెళితే..

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా నర్సన్సపేట.. లక్ష్మీనగర్ లో నివసించే 32 ఏళ్ల బొడుమూరు నాగరాజు మాజీ క్రికెటర్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఎస్డీ ఎట్ జీమొయిల్ డాట్ కామ్ పేరుతో ఒక నకిలీ ఖాతాను క్రియేట్ చేవాడు. తనకు తాను సీఎం రేవంత్ వ్యక్తిగత కార్యదర్శినని.. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అని చెప్పుకుంటాడు. పలువురు ప్రముఖులకు మొయిళ్లు.. వాట్సప్ మెసేజ్ లు పంపుతూ.. డబ్బులు డిమాండ్ చేస్తుంటాడు.

ఇటీవల కాలంలో ఇతడు బొల్లినేని ఇన్ ఫ్రా ప్రాజెక్టస్ ఎండీ శ్రీక్రిష్ణమోహన్ బొల్లినేని.. ర్యాపిడో ఎండీ అరవింద్ సుంకా.. గుప్తా రియాలిటీ ఛైర్మన్ శ్రీనివాస్ గుప్తా వెర్రబొమ్మ.. కంట్రీడిలైట్ ఎండీ చక్రధర్.. నితిన్ కౌశల్ తో పాటు ఎంతో మంది ప్రముఖులకు.. వ్యాపారవేత్తలకు ఫోన్లు చేసి ఆర్తిక సాయం కోరే ప్రయత్నం చేశాడు.

దీంతో.. ఇతగాడి మీద సైబర్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. తాజాగా అతడిపై కేసు నమోదు చేసిన తెలంగాణ సైబర్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో అతడిపై కేసు నమోదు చేసి ఏపీలో అరెస్టు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. కోర్టు ఆదేశాలతో అతడ్ని జైలుకు తరలించారు. ప్రస్తుతం ఇతడిపై తెలంగాణలో 13, ఏపీలో 16 కేసులు ఉన్నట్లుగా గుర్తించారు.

Tags:    

Similar News