రాజమౌళికి కోర్టు సమన్లు

Update: 2016-02-11 11:34 GMT
మొన్ననే పద్మశ్రీ గౌరవాన్నిపొందిన దర్శకుడు రాజమౌళికి ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. ఎందుకంటే.. ఇప్పుడు ఆయనకు ఏకంగా కోర్టు సమన్లు అందాయి. ఓ చీటింగ్ కేసుకు సంబంధించి చాలా కాలంగా కోర్టుకు హాజరుకానందుకు సమన్లు జారీ అయ్యాయి. ఈ నెల 24న వ్యక్తిగతంగా హాజరుకావాలని నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది.

హైదరాబాద్‌ ఎమ్మెల్యే కాలనీలోని ఫొటోగ్రాఫర్స్ కాలనీలో ఫ్లాట్‌ ను తనకు విక్రయిస్తానని చెప్పి ఎగ్రిమెంట్‌ చేసుకొని.. తరువాత మరొకరికి అమ్మారంటూ భువనేశ్వర్ అనే సినీ దర్శకుడు రాజమౌళిపై ఫిర్యాదు చేశారు. ఈ కేసు 2012 కు సంబంధించినది. అయతే పోలీసులు రాజమౌళిపై కేసు నమోదు చేసినా కూడా రాజమౌళి మాత్రం నాంపల్లి కోర్టులో విచారణకు హాజరు కావట్లేదు. అందుకే ఇప్పుడు కోర్టు సమన్లు జారీ చేసింది.

ఇకపోతే ఈ విషయంపై రాజమౌళి తన లీగల్‌ సలహాదారులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News