సామ్ ఫేక్ ఫోటో.. పోలీసులు ఏం చేయనున్నారో??

అయితే సమంత కొన్ని నెలల క్రితం మయోసైటిస్ వ్యాధి బారినపడ్డ విషయం తెలిసిందే.

Update: 2024-05-07 10:16 GMT

స్టార్ హీరోయిన్ సమంత.. ఇండస్ట్రీలో మళ్లీ బిజీ అవ్వడానికి సిద్ధమవుతోంది. మరికొద్ది రోజుల్లో సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవ్వనుంది. చివరగా ఖుషి మూవీతో అలరించిన సమంత.. ఇటీవల బర్త్ డే సందర్భంగా 'మా ఇంటి బంగారం' పేరుతో కొత్త సినిమా అనౌన్స్ చేసింది. స్పెషల్ పోస్టర్ కూడా షేర్ చేసింది.

ఆ పోస్టర్ లో సమంత.. చీర కట్టుకుని, గన్ పట్టుకుని చాలా అగ్రెసివ్ గా కనిపించింది. అయితే సమంత కొన్ని నెలల క్రితం మయోసైటిస్ వ్యాధి బారినపడ్డ విషయం తెలిసిందే. ఖుషి మూవీ తర్వాత విదేశాలకు వెళ్లి పూర్తి చికిత్స తీసుకుంది. కొండలు, కోనలు, ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ వ్యాధి నుంచి కోలుకునే ప్రయత్నం చేసింది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ పర్సనల్ విషయాలతో పాటు పిక్స్, వీడియోస్ షేర్ చేస్తోంది.

రీసెంట్ గా ఆమె ఇన్ఫ్రారెడ్ బాత్ కోసం వివరిస్తూ బాత్ టవల్ చుట్టుకున్న పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పోస్ట్ తర్వాత సమంత సెమీ న్యూ*డ్ పిక్ షేర్ చేసి డిలీట్ చేసిందని కొందరు తప్పుడు ప్రచారం చేశారు. సమంత ఫేక్ ఫోటోను వైరల్ కూడా చేశారు. దీంతో ఆ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొట్టింది. ఇక సమంత.. తన ఫేక్ ఫోటో స్ప్రెడ్ అవ్వడంపై పరోక్షంగా స్పందించింది.

''మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం లేదా నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండా జీవించడమే నిజమైన విజయం'' అంటూ ఇంట్రెస్టింగ్ కొటేషన్ తో కౌంటర్ ఇచ్చింది. తాను చేసిన ఇన్ఫ్రారెడ్ బాత్ పోస్టును కూడా వెంటనే డిలీట్ చేసింది. ఇక సామ్ ఫేక్ ఫోటో వైరల్ చేసిన వారిపై ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అయ్యారు. కావాలనే ఎందుకు అలా చేస్తున్నారని గట్టిగా ప్రశ్నించారు.

తాజాగా సమంత ఫ్యాన్స్ కొందరు.. ఈ విషయంపై క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సమంత ఫేక్ పిక్ ను వైరల్ చేసిన 30 ఎక్స్ ( అప్పటి ట్విట్టర్) ఖాతాలపై కంప్లైంట్ చేసినట్లు సమాచారం. పోలీసుల దృష్టికి మొత్తం విషయాన్ని తీసుకెళ్లినట్లు తెలిసింది. పోలీసులు కూడా వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారట. మరి ఈ విషయంలో చివరకు ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News