హీరోయిన్లను సాధార‌ణ మ‌హిళల్లా చూడ‌ట్లేదు

బాల న‌టిగా సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మ‌ల‌యాళ భామ నిత్య మీన‌న్ త‌న మాతృభాష‌లోనే హీరోయిన్ గా కూడా ప‌రిచ‌య‌మైంది.;

Update: 2025-06-01 10:25 GMT
హీరోయిన్లను సాధార‌ణ మ‌హిళల్లా చూడ‌ట్లేదు

బాల న‌టిగా సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మ‌ల‌యాళ భామ నిత్య మీన‌న్ త‌న మాతృభాష‌లోనే హీరోయిన్ గా కూడా ప‌రిచ‌య‌మైంది. మ‌ల‌యాళంతో పాటూ తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో కూడా ఎన్నో సినిమాలు చేసి త‌న‌కంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది నిత్యా మీన‌న్. త‌న కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వ‌స్తున్న నిత్య మీన‌న్ అంద‌రిలా కాదు చాలా డిఫ‌రెంట్.

ఎక్స్‌పోజింగ్, ఇంటిమేట్ సీన్స్ కు మొహ‌మాటం లేకుండా నో చెప్తూ ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ అమ్మ‌డికి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయంటే దానికి త‌న టాలెంటే కార‌ణం. 180 సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నిత్యా ఆ త‌ర్వాత వ‌రుస పెట్టి అక్క‌డ సినిమాలు చేస్తూ వ‌చ్చింది. మ‌ణిర‌త్నం తో చేసిన ఓకే క‌ణ్మ‌ణి సినిమాతో నిత్యా బాగా పాపులరైన విష‌యం తెలిసిందే.

అయితే నిత్య మీన‌న్ కు కాస్త పొగ‌రు అనే మాట రెగ్యుల‌ర్ గా బ‌య‌ట వినిపిస్తూ ఉంటుంది. కొన్నాళ్ల కింద‌ట ఓ ఈవెంట్ కు వెళ్లిన నిత్యామీన‌న్ కు అక్క‌డున్న ఓ ఫ్యాన్ షేక్ హ్యాండ్ ఇవ్వ‌డానికి ట్రై చేసిన‌ప్ప‌టికీ నిత్యా మాత్రం అత‌నికి న‌మ‌స్కారం చేసి త‌న‌కు జ‌లుబు ఉంద‌ని చెప్పి లోప‌లికి వెళ్లి అదే ఈవెంట్ లో అక్క‌డున్న హీరోకు హగ్ ఇచ్చింది. ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజ‌న్లు నిత్యామీన‌న్ ను బాగా ట్రోల్ చేయ‌గా, తాజాగా ఈ విష‌యంపై నిత్యా క్లారిటీ ఇచ్చింది.

చాలా మంది మ‌గాళ్లు హీరోయిన్లను స‌గ‌టు మ‌హిళ‌ల్లాగా భావించ‌ర‌ని నిత్యా మీన‌న్ చెప్పింది. హీరోయిన్ల‌ను ఈజీగా ట‌చ్ చేయొచ్చ‌ని అనుకుంటార‌ని, తాము ఎలాంటి ఈవెంట్ కు వెళ్లినా షేక్ హ్యాండ్ అంటూ త‌మ‌ను ట‌చ్ చేయడానికి ఎగ‌బ‌డ‌తార‌ని, సాధార‌ణ మ‌హిళ‌ల‌ను వాళ్లు షేక్ హ్యాండ్ అడ‌క్కుండా త‌మ‌ను మాత్ర‌మే ఎందుకు అడుగుతున్నారు? అలా ఈజీగా ట‌చ్ చేయ‌డానికి హీరోయిన్లు ఏమైనా ఆట బొమ్మ‌లా అని నిత్యామీన‌న్ ఫైర్ అయింది. ప్ర‌స్తుతం నిత్యా మీన‌న్ ఈ విష‌యంపై రెస్పాండ్ అయి మ‌ట్లాడిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

ఇక నిత్యా కెరీర్ విష‌యానికొస్తే తిరుచ్చిట్రం ఫ‌లం సినిమాలో ధ‌నుష్ తో క‌లిసి న‌టించి ఆ సినిమాలో త‌న యాక్టింగ్ కు రీసెంట్ గా ఉత్త‌మ న‌టిగా నేష‌నల అవార్డ్ ను అందుకున్న నిత్యా మీన‌న్ ఇప్పుడు మ‌రోసారి ధ‌నుష్ తో క‌లిసి ఇడ్లీ క‌డై సినిమా చేస్తోంది. త్వ‌ర‌లోనే ఇడ్లీ క‌డై ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీంతో పాటూ విజ‌య్ సేతుప‌తితో క‌లిసి త‌లైవ‌న్ త‌లైవి సినిమాలో కూడా నిత్యా న‌టిస్తోంది.

Tags:    

Similar News