పవన్‌, చరణ్‌ సినిమాల్లో చిరు ఫేవరెట్‌

చిరంజీవి పద్మవిభూషన్‌ అందుకున్న సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా కలిసి అభినందించారు

Update: 2024-05-10 07:04 GMT

మెగాస్టార్‌ చిరంజీవి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ ను మే 9న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌ లో జరిగిన ఈ కార్యక్రమంలో చిరంజీవి సతీ సమేతంగా హాజరు అయ్యారు. అంతే కాకుండా రామ్‌ చరణ్ మరియు ఉపాసన లు కూడా పాల్గొన్నారు.

చిరంజీవి పద్మవిభూషన్‌ అందుకున్న సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా కలిసి అభినందించారు. ఆ సందర్భంగా ఇరువురు సినిమాలు, రాజకీయాలు ఇతర విషయాల గురించి సుదీర్ఘంగా చిట్‌ చాట్‌ చేయడం జరిగింది. ఆ వీడియో ప్రస్తుతం యూట్యూట్ లో తెగ సందడి చేస్తుంది.

కిషన్ రెడ్డితో చిట్‌ చాట్‌ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... నాకు పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ, తమ్ముడు మరియు జల్సా అంటే చాలా ఇష్టం. జల్సా సినిమాను చాలా ఎంజాయ్ చేశాను అన్నాడు. ఇక రామ్‌ చరణ్ సినిమాల విషయానికి వస్తే మగధీర సినిమా అంటే నాకు చాలా ఇష్టం అన్నారు.

సినిమాల్లో పవన్‌ కళ్యాణ్ మరియు రామ్‌ చరణ్‌ లు మంచి విజయాలు సొంతం చేసుకోవడం చాలా సంతోషాన్ని కలిగిస్తుందని చిరంజీవి అన్నారు. రామ్ చరణ్‌ మరియు పవన్ కళ్యాణ్ లతో తనకు కూడా సన్నిహిత్యం ఉందని ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి అన్నారు.

ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి విశ్వంభర సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో చిరంజీవిని కొత్తగా చూస్తామని యూనిట్‌ సభ్యులు అంటున్నారు. చాలా సంవత్సరాల తర్వాత చిరు చేస్తున్న సోషియో ఫాంటసీ అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. 2025 సంక్రాంతికి ఈ సినిమా రాబోతుంది.

Tags:    

Similar News