శ్రీరామరాజ్యం తర్వాత చిరు-అనిల్‌ మూవీ కోసం..!

మెగాస్టార్‌ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 2026 సంక్రాంతికి ఈ సినిమా రావడం కన్ఫర్మ్‌.;

Update: 2025-06-18 05:48 GMT
శ్రీరామరాజ్యం తర్వాత చిరు-అనిల్‌ మూవీ కోసం..!

మెగాస్టార్‌ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 2026 సంక్రాంతికి ఈ సినిమా రావడం కన్ఫర్మ్‌. ఇప్పటికే షూటింగ్‌ చకచక జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటిస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో చిరంజీవితో పాటు నయనతార కూడా పాల్గొంటుంది. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలోని అందమైన లొకేషన్స్‌ లో చిరంజీవి, నయనతార కాంబో సీన్స్ షూటింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ దాదాపు వారం రోజుల పాటు చిత్రీకరణ జరుపుతారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌ చేరుకుని ఒక చిన్న షెడ్యూల్‌ను ప్లాన్‌ చేస్తున్నారు.

ఒక వైపు షూటింగ్‌ చేస్తూనే మరో వైపు ప్రమోషన్ కోసం కొన్ని షార్ట్‌ వీడియోలు, స్కిట్స్ వంటివి దర్శకుడు అనిల్‌ రావిపూడి షూట్‌ చేస్తూ ఉన్నాడు. వాటిని విడుదల సమయంలో వదలడం అనిల్‌ రావిపూడికి అలవాటు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు అలా చేయడం వల్లే మంచి రీచ్ దక్కింది. సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన విషయం తెల్సిందే. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఏమాత్రం తగ్గకుండా కంటెంట్‌ పరంగా, పబ్లిసిటీ పరంగా అనిల్‌ రావిపూడి చాలా అగ్రెసివ్‌గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. చిరంజీవిని ప్రమోషన్స్ కోసం ఫుల్‌గా వాడే అవకాశాలు ఉన్నాయి. అయితే నయనతార ఈ సినిమా ప్రమోషన్స్‌కి హాజరు అయ్యేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

నయనతార తన సొంత బ్యానర్‌లో రూపొందిన తన సినిమాలకు సైతం ప్రమోషన్స్‌కి హాజరు కాదు. అప్పట్లో బాలకృష్ణ హీరోగా నటించిన శ్రీరామ రాజ్యం సినిమా ప్రమోషన్స్‌కి నయనతార హాజరు అయింది. ఆడియో విడుదల కార్యక్రమం, 50 రోజుల వేడుక తో పాటు పలు కార్యక్రమాల్లో నయనతార పాల్గొన్న విషయం తెల్సిందే. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల ప్రమోషన్స్‌ లో అలా మీడియా ముందుకు వచ్చింది కానీ పూర్తి స్థాయిలో ప్రమోషన్‌ కార్యక్రమాలకు హాజరు కాలేదు. కేవలం టాలీవుడ్‌ సినిమాల ప్రమోషన్స్‌కు మాత్రమే కాకుండా కోలీవుడ్‌ సినిమాల ప్రమోషన్స్‌ కి కూడా నయనతార హాజరు కావడం అరుదుగా జరుగుతుంది. ఇప్పుడు మెగా మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాలకు హాజరు అయ్యేందుకు నయనతార ఓకే చెప్పిందట.

దర్శకుడు అనిల్‌ రావిపూడి మొదట కథ చెప్పే సమయంలోనే మొత్తం విషయాలను క్లీయర్‌గా చెప్పాడట. సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల గురించి ఆయన వివరించాడు. అందుకు తగ్గట్లుగానే పారితోషికం అధికంగా ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. సాధారణ పారితోషికం కంటే ఎక్కువ ఇచ్చేందుకు మేకర్స్ ఓకే చెప్పడంతో నయనతార ప్రమోషన్స్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని సమాచారం అందుతోంది. సినిమా విడుదల సమయంలో కనీసం వారం రోజుల పాటు హైదరాబాద్‌లో ఉండి నయనతార సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలకు హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. నయనతార సినిమా ప్రమోషన్స్‌కి హాజరు అయితే కచ్చితంగా మంచి ఫలితం దక్కవచ్చు.

Tags:    

Similar News