‘విన్నర్’ సినిమాకు మాల్యా కనెక్షన్

Update: 2017-02-24 05:54 GMT
వేల కోట్లు దోచేసి విదేశాలకు పారిపోయాడు ఘరానా మోసగాడు విజయ్ మాల్యా. ఇండియాలో అతడికి భారీ ఆస్తులున్నాయి. వాటిలో కొన్నింటిని జప్తు చేశారు. కొన్నింటిని వేలానికి పెట్టారు. మరి ‘విన్నర్’ టీం ఇందులో వేటిని వాడుకుందో తెలియదు కానీ.. తమ సినిమాకు మాల్యా ఆస్తులనైతే బాగానే ఉపయోగించుకుందట. ఈ విషయాన్ని డైరెక్టర్ గోపీచంద్ మలినేనినే స్వయంగా వెల్లడించాడు.

‘‘మా సినిమా ప్రధమార్థం అంతా హైదరాబాద్‌ నేపథ్యంలో జరుగుతుంది. రెండో అర్ధం బెంగళూరులో జరుగుతుంది. అందుకే అక్కడ విజయ్ మాల్యా 700 ఎకరాల స్టడ్ ఫాంలో షూట్ చేశాం. ఆయన గెస్ట్ హౌజ్ ను కూడా వాడుకున్నాం’’ అని గోపీచంద్ మలినేని తెలిపాడు. ఈ సినిమా కోసం సాయిధరమ్ ప్రమాదకరమైన గుర్రంతో పని చేశాడని గోపీచంద్ తెలిపాడు.

‘‘సాయిధరమ్ వాడిన గుర్రానికి 20 ఏళ్ల అనుభవం ఉంది. హాలీవుడ్ సినిమాల్లోనూ అది కనిపించింది. అది వైల్డ్ ట్రైన్డ్ హార్స్. యాక్షన్ అంటే పరిగెడుతుంది. కట్ చెబితే ఆగిపోతుంది. అది చాలా వేగంగా పరిగెడుతుంది. దాన్ని సవారీ చేయడం అంత సులువ కాదు. తేజుకు కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురైనా పెద్ద ప్రమాదం ఏమీ జరగకుండా సినిమాను పూర్తి చేశాం’’ అన్నాడు గోపీచంద్. ‘విన్నర్’ సినిమా తనకు పెద్ద స్టార్లతో పని చేసే అవకాశం కల్పిస్తుందని గోపీచంద్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News