జల్లికట్టు - త్రిష... కొత్త మలుపు!

Update: 2017-01-20 16:47 GMT
ప్రస్తుతం తమిళనాడులో జల్లికట్టు అంశం ఫుల్ హాట్ టాపిక్. రకరకాల సంచలనాలకు, వివిధరకాల సంఘటనలకు ఈ వ్యవహారం వేదికైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా స్పందించిన సంగతి తెలిసిందే. వారందరితోపాటు పెటా ప్రచారకర్తగా పాపులర్ అయిన త్రిష తన మనసులో మాట సూటిగా చెప్పింది.. జల్లికట్టు వద్దని వాదించింది. దానికి కారణం పెటా కార్యకర్తగా గతంలో త్రిష చాలా బలంగా ఉధ్యమించడమే అనేది అందరికీ తెలిసిన విషయమే!

గతంలో సోషల్ మీడియాలో కూడా పెటా కార్యక్రమాలకు ఫుల్ ప్రచారం చేసిపెట్టిన త్రిష... ఎక్కడైనా మూగజీవాలపై అకృత్యాలు జరిగితే వాటిమీద వెంటనే స్పందించేది. దీంతో ప్రచారకర్తగా పెటాలో కీరోల్ ప్లే చేసింది. అయితే... ఆ బాధ్యతతో ముందు జరగబోయే ప్రమాధాన్ని ఊహించని త్రిష జల్లికట్టుకు వ్యతిరేకంగా మాట్లాడింది. దీంతో తమిళనాడులో జల్లికట్టు సానుకూల యువత ఆమె ఫోటోలకు దండలేసి, ఆమెకు శ్రద్ధాంజలి కూడా ప్రకటించేశారు. అయితే ఈ విషయాలపై తాజాగా త్రిష తల్లి ఉమ కృష్ణన్ మీడియా ముందుకొచ్చింది.

అంతా అనుకుంటున్నట్లు, చెబుతున్నట్లు పెటాలో ఎన్నడూ త్రిష అంత యాక్టివ్‌ గా లేదని, ఇదే క్రమంలో ప్రస్తుతం ఆమె పెటాకు చాలా దూరంగా ఉంటుందని, ఇంకా గట్టిగా మాట్లాడితే.. భవిష్యత్తులో ఆ సంస్థకు ఎలాంటి ప్రచారం చేయదని స్పష్టం చేసింది ఉమ కృష్ణన్. ఇదే సమయంలో మరో అడుగు ముందుకేసిన త్రిష తల్లి... జల్లికట్టును తన కూతురు ఎన్నడూ వ్యతిరేకించలేదని, ఆమె కూడా తమిళ అమ్మాయే అని చెప్పుకొచ్చింది. దీంతో... నిన్న మొన్నటివరకూ పెటాలో కీ రోల్ ప్లే చేసి, ఆ హోదాను అనుభవించి, తద్వారా జల్లికట్టును వ్యతిరేకించిన త్రిష విషయంలో ఆమె అమ్మ సడన్ గా చెబుతున్న ఈ విడ్డూరపు మాటలు విని అంతా ఆశ్చర్యపోతున్నారట!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News