ఆంటీలతో రొమాన్స్ చేయాలంటున్న యంగ్ హీరో

Update: 2016-07-06 13:30 GMT
మాధురి దీక్షిత్ వయసు 49 ఏళ్లు.. మనీషా కొయిరాలా ఏజ్ 45 ఏళ్లు.. టబుకేమో 44 ఏళ్లు నిండిపోయాయి. మరి వీళ్లతో 30 ఏళ్ల వయసున్న ఓ యువ కథానాయకుడు రొమాన్స్ చేయాలనుకుంటున్నాడు. అతను మరెవరో కాదు.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’ లాంటి రొమాంటిక్ లవ్ స్టోరీతో అమ్మాయిల్లో మాంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సుశాంత్.. తన తోటి హీరోయిన్లతో ప్రేమాయణాలు బాగానే నడుపుతాడన్న పేరుంది. ఐతే ఇతగాడికి ఆ ముగ్గురు ఆంటీలంటే పిచ్చట. ఒక్కసారైనా వాళ్లతో తెరమీద రొమాన్స్ చేయాలన్నది తన కోరిక అని మొహమాటం లేకుండా చెప్పేశాడు సుశాంత్.

ఆ ముగ్గురూ తన దృష్టిలో సూపర్ హీరోయిన్లని.. వారి అందం తనకు టీనేజీలో నిద్రలేని రాత్రులను మిగిల్చిందని అతను చెప్పాడు. అవకాశం వస్తే ఆ ముగ్గురితోనూ రొమాన్స్ చేయాలని తనకు కోరికగా ఉందని.. కనీసం ఒకరితో అయినా అవకాశం వస్తుందేమో చూడాలని అతనన్నాడు. మరీ అంత కోరిగ్గా ఉంటే.. ఆంటీలతో రొమాన్స్ చేసే కుర్రాడి కథేదైనా రాయించుకుని అందులో ఆ ముగ్గురినీ హీరోయిన్లుగా పెట్టుకుని ఇతను హీరోగా నటిస్తే సరిపోతుందేమో. ఈ సంగతలా వదిలేస్తే.. ‘1 నేనొక్కడినే’ భామ కృతి సనన్ తో సుశాంత్ ఘాటు రొమాన్స్ చేస్తున్నట్లుగా బాలీవుడ్లో వార్తలు గుప్పుమంటున్నాయి. వీళ్లిద్దరూ కలిసి ‘రాబ్తా’ అనే సినిమా చేస్తున్నారు.
Tags:    

Similar News