ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు (81) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ బ్యానర్ ను స్థాపించిన ఆయన... శంకరాభరణం - సితార - స్వాతిముత్యం - సాగరసంగమం - సిరిసిరిమువ్వ - సీతాకోక చిలుక - స్వయంకృషి - ఆపద్బాంధవుడు తదితర చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆయనకు పలు చిత్రాలకు నంది అవార్డులతో పాటు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి.ఆయన నిర్మించిన పలు చిత్రాలు రష్యన్ భాషలోకి కూడా అనువాదం అయ్యాయి.
నాగేశ్వరరావు మృతదేహాన్ని ఫిల్మ్నగర్ రోడ్ నెంబర్ 8లోని ఆయన నివాసానికి తరలించారు. రేపు సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి.
నాగేశ్వరరావు మృతదేహాన్ని ఫిల్మ్నగర్ రోడ్ నెంబర్ 8లోని ఆయన నివాసానికి తరలించారు. రేపు సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి.