లైగ‌ర్ బ్యూటీ లైఫ్‌లో ఊహించ‌ని మ‌లుపు?

మార్చిలో ఈ జంట బ్రేక‌ప్ అయిందంటూ పుకార్లు మొద‌ల‌య్యాయి.

Update: 2024-05-05 05:55 GMT

`లైగ‌ర్` చిత్రంతో టాలీవుడ్‌కి ప‌రిచ‌య‌మైంది అన‌న్య పాండే. కానీ సౌత్ లో తొలి ప్ర‌య‌త్నం ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. ఆ త‌ర్వాత పూర్తిగా బాలీవుడ్‌కే అంకితమైంది. హిందీ చిత్ర‌సీమ‌లో ప్ర‌ముఖ యువ‌హీరోల స‌ర‌స‌న న‌టిస్తున్న అన‌న్య ఇంత‌లోనే ఆదిత్యారాయ్ క‌పూర్ తో ప్రేమ‌లో ప‌డింది. ఈ జంట కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే.


కానీ ఇంత‌లోనే ఆదిత్యతో బ్రేక‌ప్ అయ్యిందంటూ ఒక‌టే ప్ర‌చారం సాగుతోంది. మార్చిలో ఈ జంట బ్రేక‌ప్ అయిందంటూ పుకార్లు మొద‌ల‌య్యాయి. అయితే ఈ బ్రేక‌ప్ త‌ర్వాత ఆదిత్య రాయ్ క‌పూర్ అర్థరాత్రి త‌న మాజీ ల‌వ‌ర్ శ్రద్ధా క‌పూర్‌ను ఆమె నివాసంలో సందర్శించిన ఫోటో ఒకటి వైర‌ల్ గా మారింది. నిజానికి ఈ ఫోటో ఆదిత్య - శ్రద్ధా అభిమానులను ఉలిక్కిపడేలా చేసిందనడంలో సందేహం లేదు. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటే, ఇంటర్నెట్ వెర్రిపోతుంది అని ఒక అభిమాని వ్యాఖ్యానించారు. మరొకరు మాట్లాడుతూ ``రాహుల్ మోడీ సినిమా చేస్తున్నాడు. అందులో ఎక్కువగా శ్రద్ధా- ఆదిత్య రాయ్ జంట‌గా క‌నిపిస్తారు`` అని వ్యాఖ్యానించారు. తూ ఝూతి మైన్ మక్కార్ రచయిత రాహుల్ మోడీతో శ్రద్ధా డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ ఇప్పుడు స‌న్నివేశం మారుతోంది.


గత నెలలో అనన్య పాండే తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక నిగూఢమైన పోస్ట్‌ను షేర్ చేసింది. ఇది ఆదిత్యతో బ్రేక‌ప్ గురించిన ఊహాగానాలకు దారితీసింది. ``ఇది నిజంగా మీ కోసం ఉద్దేశించినది అయితే.. పాఠం నేర్చుకోవాలి. మీరు తిరస్కరణకు గురైనప్పటికీ.. దానిని తిరస్కరించినట్లయితే....అది ఎప్పటికీ చాలా అందంగా ఉండదు. మీరు నిజంగా మీది అని భావించినప్పటికీ అది ఎప్ప‌టికీ తిరిగి రాదు - ఎందుకంటే ఇది నిజంగా ఉద్దేశ‌పూర్వ‌క‌మైన‌ది`` అని ఆవేద‌న చెందింది. బ్యాడ్ ఐ అలాగే నీలిరంగు సీతాకోకచిలుక ఈమోజీల‌ను అన‌న్య షేర్ చేసింది.

Read more!

ఈ ఏడాది ప్రారంభంలో ఒక పాపుల‌ర్ అవార్డ్స్ షోలో మాజీలు ఆదిత్య రాయ్ కపూర్ -శ్రద్ధా కపూర్ మళ్లీ కలిశారు. ది నైట్ మేనేజర్‌లో అద్భుత‌మైన నటనకు ఆదిత్య రాయ్ కపూర్ ఉత్తమ నటుడిగా పుర‌స్కారం గెలుచుకోగా, తూ ఝూతి మైన్ మక్కార్‌లో తన అద్భుతమైన నటనకు శ్రద్ధా కపూర్ ఉత్తమ నటి (పాపులర్ ఛాయిస్)గా ఎంపికైంది.

Tags:    

Similar News