అ! దర్శకుడి చేతిలోకి క్వీన్

Update: 2018-05-28 06:04 GMT
అ! సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన దర్శకుడు ప్రశాంత్ వర్మ. అ! సినిమాతో ఎదో చరిత్ర సృష్టిస్తాడు అనుకున్న ఈ దర్శకుడికి అన్ని వర్గాల నుంచి హిట్ టాక్ అందలేదు. చాలా క్రియేటివ్ సినిమా అని చెప్పారు గాని చిత్ర యూనిట్ కి సినిమా ఇండస్ట్రీ నుంచే ప్రశంసలు కొంచెం కూడా దక్కలేదు. ఆ సంగతి పక్కనపెడితే నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడు అని అనుకుంటున్నా సమయంలో ప్రశాంత్ ఓ రీమేక్ కథకు ఒకే చెప్పేశాడట.

బాలీవుడ్ క్వీన్ సినిమా సౌత్ లో నాలుగు భాషల్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాను తెలుగు మలయాళం భాషలకు నీలకంఠ దర్శకత్వం వహిస్తుండగా రమేష్ అరవింద్ తమిళ్ కన్నడ వెర్షన్స్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే మొదట బాగానే సెట్ అయ్యింది అనుకున్న ఈ కాంబినేషన్ ఇటీవల తెలుగు క్వీన్ తమన్నాకు నీలకంఠకు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో సినిమా నుంచి తప్పుకున్నారు.

అయితే ఆ తరువాత అరవింద్ తెలుగు క్వీన్ కి కూడా దర్శకత్వం వహిస్తారు అనే టాక్ వచ్చినప్పటికీ మూడు భాషల్లో తెరకెక్కించడం అంత సులువు కాదని నో చెప్పారట. దీంతో అ! దర్శకుడిని రంగంలోకి దింపారు. ప్రశాంత్ వర్మ తన రెండవ సినిమాని స్టార్ హీరోలతో చేయబోతున్నాడు అని గతంలో చాలా న్యూస్ లు వచ్చినా ఫైనల్ గా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకు వర్క్ చేయనున్నాడు. మరి ఈ రీమేక్ కథతో అయినా దర్శకుడు అన్ని వర్గాల వారిని మెప్పిస్తాడో లేదో చూడాలి.     
Tags:    

Similar News