'బాహుబలి' 5 ఏళ్ల సందర్భంగా ప్రభాస్ స్పెషల్ పోస్ట్!

Update: 2020-07-11 03:30 GMT
రాజమౌళి దర్శకత్వంలో అయిదు సంవత్సరాల క్రితం వచ్చిన బాహుబలి సినిమా రికార్డు ల మోత మోగించిన విషయం తెలిసిందే. ప్రభాస్ ను ఆల్ ఇండియా స్టార్ గా మార్చిన బాహుబలి విడుదల అయ్యిన నేటికి 5 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా ప్రభాస్ సోషల్ మీడియాలో బాహుబలి పోస్టర్ ను పోస్ట్ చేయడంతో పాటు సినిమాకు పని చేసిన వారందరినీ తన పోస్ట్ లో ట్యాగ్ చేశాడు.

బాహుబలి చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా సోషల్ మీడియాలో వారి అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. బాహుబలి 5 ఏళ్ళు అయిన సందర్భంగా ప్రభాస్ తన 20 వ సినిమా రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాలో ప్రభాస్ కు జోడిగా పూజ హెగ్డే నటిస్తోంది.
Tags:    

Similar News